ISI Espionage: పాకిస్తాన్ ఏజెంట్లను సోషల్ మీడియా పట్టించింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్న ఢిల్లీ దంపతులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. 2024లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లతో సాహిల్ అతని భార్య సమీరాకు పరిచయం ఎర్పడింది.
2024-2025 మధ్య కాలంలో 8 భారతీయ సిమ్ కార్డులను దుబాయ్ మీదుగా పాకిస్థాన్కు దంపతులు పంపించారు. ఈ సిమ్ కార్డుల ద్వారా పాకిస్థాన్లో వాట్సాప్ ఖాతాలు తెరిచి, భారతదేశంలోని కీలక సమాూచారాన్ని సేకరించడానికి ఉపయోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
Also read: గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?
భారత్లోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల గురించి సమాచారం సేకరించడం, కోర్ట్ మార్షల్ ఎదుర్కొంటున్న సైనిక అధికారుల వివరాలు అందించడం వంటి పనులకు సాహిల్ పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సిమ్ కార్డులు సరఫరా చేసినందుకు వీరు సుమారు రూ. 30 వేలు ముట్టజెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు.
Alao Read: రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!