E-Paper
Advertisement

Delhi Liquor Case: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు

Delhi Liquor Case: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement

arvind kejriwal news latestDelhi Liquor Case updates(Telugu news headlines today): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.15వేల పూచికత్తుపై ఈ మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన కోర్టును నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. అయితే ఈకేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కే. కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ అధికారులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదులు చేశారు. దీంతో మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు నిరాకరించింది.

Advertisement

ఢిల్లీ లిక్కర్ కేసులు అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఇప్పటివరకు 8 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లను కేజ్రీవాల్ 8 సార్లు దాటవేస్తూ వచ్చారు. ఈడీ అధికారులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో రెండు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ చేసిన ఫిర్యాదులపై విచారణను ఎదుర్కొనేందుకు మార్చి 16న తమ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సమన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు నిరారించింది. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాలంటే శనివారం జరిగే ట్రయల్‌ కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్‌ సియాల్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందని కేంద్రం అధికార పార్టీ అయిన బీజేపీ తనను వేధించేందుకే ఈ కేసులు పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో మరో ఉత్సవం.. 24 గంటల పాటు దర్శనం..!

Advertisement

ఈ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు రెండేళ్ల క్రితం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జోరు పెంచిన ఈడీ అధికారులు తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈ కేసులో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమెకు రెండు సార్లు మహిళా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Related News

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×