BigTV English
Advertisement

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..!

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..!
Delhi High Court To Pronounce Verdict on Kejriwal Petition
Delhi High Court To Pronounce Verdict on Kejriwal Petition

Delhi High Court To Pronounce Verdict on Kejriwal Petition: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.


హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తారు.

తన అరెస్ట్‌తో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో తన తదుపరి రిమాండ్‌ను కూడా కేజ్రీవాల్ సవాలు చేశారు. అనంతరం కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. AAP జాతీయ కన్వీనర్ ఈడీ తనని అరెస్టు చేసిన సమయంపై ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా, నిష్పాక్షికమైన ఎన్నికలు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌తో సహా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి ఇది విరుద్ధంగా ఉందని అన్నారు.


ఈడీ ఈ అభ్యర్థనను వ్యతిరేకించింది. కేజ్రీవాల్‌కు, “ఆమ్ ఆద్మీ”కి సమానంగా చట్టం వర్తింపచేసామన్నది. రాబోయే ఎన్నికల కారణంగా అరెస్టు నుంచి విముక్తి పొందలేరని వాదించింది.

Also Read: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ పిటిషన్.. భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు

ఫెడరల్ యాంటీ మనీలాండరింగ్ ఏజెన్సీ బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడంతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టులో హాజరుపరచగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×