E-Paper
Advertisement

Rahul’s Helicopter Checking: రాహుల్ చాపర్‌లో తనిఖీలు.. ఏం జరిగింది..?

Rahul’s Helicopter Checking: రాహుల్ చాపర్‌లో తనిఖీలు.. ఏం జరిగింది..?
Advertisement

Rahul Gandhi’s Helicopter Checked in Tamil Nadu: సార్వత్రిక ఎన్నికల ప్రచారం హొరెత్తుతోంది. అధికార బీజేపీ-విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల మాదిరిగా పేలుతున్నాయి. అయితే తొలి విడత ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ఎన్నికల అధికారులు ఆయా రాష్ట్రాలపై దృష్టి సారించారు. గడిచిన రెండురోజులుగా తమిళనాడులో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అటువైపు ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. తాజాగా నీలగిరి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హెలికాఫ్టర్‌ను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది.

తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రాహుల్ హెలికాప్టర్ నీలగిరిలో ల్యాండయ్యింది. రాహుల్ హెలికాప్టర్ దిగగానే ఫ్లయింగ్ స్వ్కాడ్ చుట్టుముట్టింది. దాదాపు 10 నిమిషాల సేపు చాపర్‌లో తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి నగదు, నగలు లభించలేదు. దీంతో అక్కడి నుంచి అధికారులు వెళ్లిపోయారు.

Advertisement

నీలగిరి నియోజకవర్గం నుంచి డీఎంకె అభ్యర్థి ఏ రాజా పోటీ చేస్తున్నారు. తొలివిడత ఎన్నికలు ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని సీట్లకు పోలింగ్ జరగనుంది. సమయం కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. రీసెంట్‌గా శనివారం ఫ్లయింగ్ స్వ్కాడ్ చేపట్టిన సోదాల్లో 1000 కేజీల బంగారం పట్టుబడింది. ఈ క్రమంలోనే అధికారులు తనిఖీలు చేసినట్టు సమాచారం. నీలగిరి సభ తర్వాత కేరళకు వెళ్లారు రాహుల్‌గాంధీ.

Also Read: ఎన్నికల వేళ 1425 కేజీల బంగారం సీజ్.. ఎక్కడ?

Advertisement

ఆదివారం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి నగదు లభించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరుసగా జరుగుతున్న పరిస్థితులను గమనించిన విపక్ష నేతలు.. ఈసీ అధికారులు కూడా తమనే టార్గెట్ చేశారని అంటున్నారు.

Tags

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×