E-Paper
Advertisement

Amit Shah: 75 ఏళ్లు నిండినా సరే.. మోదీయే మూడో సారి ప్రధాని: అమిత్ షా

Amit Shah: 75 ఏళ్లు నిండినా సరే.. మోదీయే మూడో సారి ప్రధాని: అమిత్ షా

Amit Shah: మోదీ ప్రధానిగా మూడో సారి తన పదవి కాలాన్ని పూర్తి చేస్తారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రధానికి 75 ఏళ్లు నిండుతాయని.. అప్పుడు పదవీ విరమణ చేస్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. మోదీకి 75 ఏళ్లు వచ్చినా ప్రధాని అవుతారని తెలిపారు.

మోదీ మూడో సారి కూడా పాలనను పూర్తి చేస్తారని నొక్కి చెప్పారు. అంతే కాకుండా కేజ్రీవాల్ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను సీఎం పదవి నుంచి తొలగిస్తారని అన్నారు. అమిత్ షాను ప్రధానిని చేస్తానని వ్యాఖ్యానించగా దీనిపై అమిత్ షా స్పందించారు. హైదరాబాద్ లో ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీజీ ప్రధాని కాలేరని బీజేపీ రాజ్యాంగంలో లేదని అన్నారు. మరో సారి ఆయనే ప్రధాని అయి పదవీ కాలం కూడా పూర్తి చేస్తారని చెప్పారు.

Also Read: నేడు నేషనల్ టెక్నాలజీ డే.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ వయసు గురించి మాట్లాడారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులు కరువయ్యారని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీలో నేతల వయస్సు 75 ఏళ్లు అని అన్నారు. మోదీ వయస్సు సెప్టెంబర్ 17 తో 75 ఏళ్లకు చేరుతుందని చెప్పారు. మోదీ రిటైర్ అవుతారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×