E-Paper
Advertisement

MS Swaminathan Commission Report: ఎంఎస్‌పీపై స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది.. నాటి యూపీఏ నేటి ఇండియా కూటమి మాటేంటి?

MS Swaminathan Commission Report: ఎంఎస్‌పీపై స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది.. నాటి యూపీఏ నేటి ఇండియా కూటమి మాటేంటి?
Advertisement
MS Swaminathan Commission Report on MSP

Swaminathan Commission Recommendations: ఎంఎస్‌పీకి చట్టబద్ధమైన హామీతోపాటు పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేశాయి. రైతులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్‌. కమిషన్ సూచించిన ఫార్ములా ప్రకారం ఎంఎస్‌పీని నిర్ణయించాలని వారు కోరుతున్నారు. మంగళవారం, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిలబడి ఉన్నప్పుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాను అధికారంలోకి వస్తే, ఎంఎస్‌పీ చట్టబద్ధమైన హక్కును చేస్తానని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని రాహుల్ అన్నారు.

అయితే 2010లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, స్వామినాథన్ కమిషన్ సూచించిన ఫార్ములాను ఉపయోగించి ఎంఎస్‌పీని నిర్ణయించడానికి ప్రభుత్వం నిరాకరించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, అప్పటి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కేవీ థామస్ ఇలా చేయడం వల్ల ‘మార్కెట్ పరిస్థితి మరింత దిగజారవచ్చు’ అని అన్నారు.

Advertisement

2010లో స్వామినాథన్ కమిషన్ ఎంఎస్‌పీ సిఫార్సుపై ప్రభుత్వం ఏం చెప్పింది?
2010 ఏప్రిల్‌లో రాజ్యసభలో బీజేపీకి చెందిన ప్రకాష్ జవదేకర్ అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగారు. రైతులకు చెల్లింపుల కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందా లేదా అనేది చెప్పాలన్నారు.

ప్రతిస్పందనగా వ్వవసాయశాఖ మంత్రి కేవీ థామస్ సభకు ఇలా చెప్పారు. “ప్రొఫెసర్ M.S. స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతు కమిషన్ కనీస మద్దతు ధర సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా ఉండాలని సిఫార్సు చేసింది. అయితే, ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించలేదు ఎందుకంటే “ఎంఎస్‌పీ ఆబ్జెక్టివ్ ప్రమాణాలు, సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (CACP) సిఫార్సు చేసింది. కాబట్టి, ఖర్చుపై కనీసం 50% పెంచడం మార్కెట్‌ను వక్రీకరించే అవకాశాలున్నాయి.”

Advertisement

Read More: ఢిల్లీలో రైతన్నలు లేవనెత్తిన డిమాండ్లు ఇవే..!

స్వామినాథన్ నివేదికలో ఎంఎస్‌పీ సూత్రం ఏమిటి?
ప్రస్తుతం, ప్రభుత్వం A2+FL ఫార్ములా సహాయంతో ఎంఎస్‌పీని నిర్ణయిస్తుంది. ఇందులో విత్తనాలు, ఎరువులు, కూలీలు, నీటిపారుదల వంటి నగదు ఖర్చులతో పాటు రైతు కుటుంబ సభ్యుల కూలీల అంచనా వ్యయం కలుపుతారు. అన్నింటినీ కలిపి ఎంఎస్‌పీ ఖర్చు కంటే కనీసం 1.5 రెట్లు ఎక్కువగా నిర్ణయిస్తారు.
స్వామినాథన్ కమిషన్ నివేదికలో ఎంఎస్‌పీ కోసం C2+50% ఫార్ములాను ఇచ్చింది. దీని ప్రకారం, పంట సగటు ఖర్చు కంటే 50% ఎక్కువ MSP ఉండాలి. ఇందులో మూలధనం, భూమి అద్దె ఇన్‌పుట్ ఖర్చు ఉంటుంది, దీని వల్ల రైతులకు 50 శాతం రాబడి లభిస్తుంది.

కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదన్న ఆరోపణలపై కాంగ్రెస్ స్పందన..
కాంగ్రెస్ తరపున పవన్ ఖేడా స్పందించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వామినాథన్‌ కమిషన్‌’ని కాంగ్రెస్‌ అమలు చేయలేదని మోదీ ప్రభుత్వం చెబుతోందని.. అయితే స్వామినాథన్‌ కమిషన్‌లో 201 సిఫార్సులు ఉన్నాయని, అందులో యూపీఏ ప్రభుత్వం 175 సిఫార్సులను అమలు చేసిందనేది వాస్తవం. 26 సిఫార్సులు మిగిలి ఉన్నాయి, వాటిలో ఎంఎస్‌పీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రకటన నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు (మల్లికార్జున్) ఖర్గే, రాహుల్ గాంధీ చేశారు.

“ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధమైన హక్కును చేస్తాం” అని మంగళవారం రాహుల్ గాంధీ ప్రకటించారు.

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×