BigTV English
Advertisement

Train Derailed: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Train Derailed: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Train Derailed: దేశంలో రైలు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లామ్ నగరానికి సమీపంలో గురువారం (అక్టోబర్ 3, 2024) రాత్రి జరిగిందని సమాచారం. జాతీయ మీడియా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని బకానియా భోరి నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ ఢిల్లీ ముంబై మార్గంలో ప్రయాణిస్తుండగా.. రత్లామ్ రైల్వే యార్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది.


గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో అందులోని మూడు బోగీలు కింద పడ్డాయి. ఆ మూడు బోగీలలో పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నట్లు తెలిసింది. ఒక బోగీ నుంచి పెట్రోల్ లీక్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:  ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..


ఈ ఘటనపై రత్లామ్ డివిజనల్ మేనేజర్ రజనీష్ కుమార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో మూడు బోగీలు కింద పడ్డాయి. ఒక బోగీలో నుంచి పెట్రోల్ లీక్ అవుతోంది. మేము ఎలాంటి భారీ ప్రమాదం జరగకుండా చర్యలు తీసకుంటున్నాం. కింద పడిన బోగీల నుంచి ప్రజలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. కింద పడిన బోగీల సమీపంలో ఎవరినీ సిగరెట్, బీడీ లాంటి పొగత్రాగకూడదని కఠినంగా ఆదేశించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.” అని అన్నారు.

బోగీలను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నంలో రైల్వే సిబ్బంది
ప్రమాదం కారణంగా మూడు రైలు బోగీలు కిందపడడంతో ఆ మార్గంలో ఇతర ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే ఉన్నతాధికారులు వెంటనే చేరుకున్నారు. రత్లామ్ డివిజనల్ మేనేజర్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వే లైన్ త్వరగా క్లియన్ చేయడానికి పనులు ప్రారంభించాం. త్వరలోనే రిపేరింగ్ ట్రైన్ తీసుకువచ్చి బోగీలను తిరిగి పట్టాలపై ఎక్కించడం జరుగుతుంది. ఇప్పటికే ఒక బోగీని పైకి లేపడం జరిగింది. రెండో బోగీ విషయంలో కష్టంగా ఉంది. అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. రైలు ప్రమాదం జరగడానికి కారణాలను ఒక బృందం విశ్లేషిస్తోంది. ప్రస్తుతానికి ఈ మార్గంలో ప్రయాణించే ఏ ట్రైన్లు కూడా రద్దు చేయమని చెప్పలేదు. కానీ ఘటన కారణంగా కొన్ని ట్రైన్లు ఆలస్యం చేయడం జరిగింది. రైలు ప్రమాదం కారణంగా ఇరు వైపులా రెండు ట్రైన్లు నిలిచిపోయి ఉన్నయని తెలుస్తోంది.

Related News

Terrorists Arrest: లేడీ డాక్టర్ సాయంతో తీవ్రవాదుల భారీ ప్లాన్.. 12 సూట్ కేసులు, 20 టైమర్లు, రైఫిల్ స్వాధీనం.. ఎక్కడంటే?

Delhi Air Emergency : శ్వాస ఆగుతోంది మహాప్రభూ.. రోడ్డెక్కిన దిల్లీవాసులు.. పిల్లలు, మహిళలు సైతం అరెస్ట్?

New Aadhaar App: కొత్త ఆధార్ యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై అన్నీ అందులోనే, ఆ భయం అవసరం లేదు

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Big Stories

×