BigTV English
Advertisement

Heatwave Over in India: గుడ్ న్యూస్.. ఇక వడగాలుల్లేవ్.. ఈ రాష్ట్రాలకు వర్షసూచన: ఐఎండీ!

Heatwave Over in India: గుడ్ న్యూస్.. ఇక వడగాలుల్లేవ్.. ఈ రాష్ట్రాలకు వర్షసూచన: ఐఎండీ!

Heatwave is Almost Over in India: మండువేసవి నుంచి దేశప్రజలకు ఉపశమనం లభిస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 2 రాష్ట్రాల్లో మినహా.. దేశమంతా హీట్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. బంగాళాఖాతం నుంచి తేమ పెరగడంతో.. ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడతాయని అంచనా వేసింది. వడగాలుల కాలం దాదాపు ముగిసినట్లేనని, ఇక కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.


శుక్రవారం పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశమంతా వేడిగాలులు తగ్గుతాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. హీట్ వేవ్ తగ్గినప్పటికీ.. వర్షాలు అధికంగా ఉంటాయో లేదో అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవవచ్చని తెలిపారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు.. అస్సాం, మేఘాలయ సమీప రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పారు.

మరోవైపు నేటి నుంచి చార్ ధామ్ యాత్ర మొదలైంది. ఉదయం 7.10 గంటలకు జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం.. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆలయం తలపులు తెరచుకోగానే హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిసింది.


Also Read: ఎండలల్లో ఇదే రికార్డు.. దేశంలో ఎన్నడూ లేనంతగా భారీగా..

మరోవైపు తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×