E-Paper
Advertisement

Congress: ట్యాక్స్ టెర్రరిజానికి టార్గెట్‌గా కాంగ్రెస్.. మరో రెండు ‘ఐటీ’ నోటీసులు

Congress: ట్యాక్స్ టెర్రరిజానికి టార్గెట్‌గా కాంగ్రెస్.. మరో రెండు ‘ఐటీ’ నోటీసులు
Advertisement

Congress Party: కాంగ్రెస్ పార్టీకి ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రూ.1,800 కోట్లు మేర ఆదాయపన్ను రికవరీ నోటీసులు పంపగా.. శనివారం మరో రెండు నోటీసులు పంపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ వెల్లడించారు.

శనివారం కాంగ్రెస్ పార్టీకి ఆదాయపన్ను శాఖ మరో రెండు నోటీసులు అందించింది. రెండు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకీ పన్ను నోటీసులు రావడంతో దీనిపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ధీటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ టెర్రరిజానికి టార్గెట్ గా మారిందని మండిపడ్డారు.

Advertisement

2017-18 నుంచి 2020-21 ఆదాయపన్ను అసెస్ మెంట్ సంవత్సరాలకుగాను పెనాల్టీ, వడ్డీ మొత్తం కలిపి రూ.1,800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపింది. అయితే నాలుగేళ్ల రిటర్న్స్ పై రీఅసెస్ మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్నా ఐటీ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయినా సరే కోర్టులో కాంగ్రెస్ పార్టీకి నిరాశ ఎదురైంది. దీంతో ఐటీ శాఖ రికవరీ నోటీసులు పంపింది.

Also Read: ED Summons to Kailash : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. మరో ఆప్ మంత్రికి ఈడీ సమన్లు

Advertisement

దీంతోపాటుగా 2014 నుంచి 2017 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను రిటర్నులను కూడా రీ అసెస్‌మెంట్ చేసే చర్యలను ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.135 కోట్ల నగదును కూడా ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×