E-Paper
Advertisement

India-Bhutan check post: భారత్-భూటాన్ మధ్య మరో అడుగు.. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌‌ ప్రారంభించిన మంత్రి బండి సంజయ్

India-Bhutan check post: భారత్-భూటాన్ మధ్య మరో అడుగు.. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌‌ ప్రారంభించిన మంత్రి బండి సంజయ్
Advertisement

India-Bhutan check post: భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరో అడుగు ముందుకేశాయి. కొత్తగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ప్రారంభం కావడంతో వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలను మరింత సులభతరం కానున్నాయి. సరిహద్దు ప్రయాణం, ప్రాంతీయ కనెక్టివిటీకి గణనీయమైన పురోగతిని కనిపించనుంది.

భారత్-భూటాన్ మధ్య సంబంధాల్లో కీలక అడుగు పడింది. ఇందులోభాగంగా అసోంలోని దర్రంగా ప్రాంతం వద్ద ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. గురువారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.

Advertisement

భూటాన్ ప్రధాని, అసోం గవర్నర్‌తో కలిసి చెక్ పోస్టును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు వల్ల ఇరుదేశాల మధ్య పెరగనున్న ప్రజా సంబంధాలు పెరగనున్నాయి. దీంతో భారత్‌కు లాజిస్టిక్ ఖర్చుల భారం తగ్గనుంది.

భూటాన్‌కు కేవలం 700 మీటర్ల దూరంలో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ప్రాంతం ఉంది. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐసీపీ దర్రంగా ప్రాంతం ఇరుదేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడమేకాదు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

Advertisement

ALSO READ: జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్, ఎందుకు?

అంతకుముందు అసొం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు స్వాగతం పలికారు ఆ రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు. అనంతరం అసొం గవర్నర్‌తో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడి నేరుగా దర్రంగా ప్రాంతానికి చేరుకున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×