E-Paper
Advertisement

Jammu & Kashmir: జమ్మూ-కశ్మీర్‌‌లో ఉగ్రదాడులు.. పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష

Jammu & Kashmir: జమ్మూ-కశ్మీర్‌‌లో ఉగ్రదాడులు..  పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష
Advertisement
Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత నాలుగు రోజుల్లోనే నాలుగు దాడులకు పాల్పడ్డారు. జూన్ 9న రియాసిలో బస్సుపై మొదటి సారి దాడి జరిగింది. తర్వాత మరో మూడు దాడులు చేశారు. కథువా జిల్లా హీరానగర్‌లోని సైదా సుఖల్ గ్రామంలో ఓ ఇంటిపై దాడి చేశారు. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్ మరణించారు. తర్వాత దోడాలని ఛత్తర్ గాలాలోని నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల జాయింట్ చెక్ పోస్టుపై అటాక్ చేశారు. ఇందులో ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని సమీక్ష..
జమ్మూకశ్మీర్‌లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, జమ్మూ కశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాలతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లో భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యాకలాపాలపై వంటి వివరాలను ప్రధాని తెలుసుకున్నారు. ఈ మేరకు ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి తీసుకురావాలని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం.
శాంతిభద్రతలకు విఘాతం
జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నట్లు డీజీపీ ఆర్ఆర్ స్వైన్ ఆరోపించారు. అయితే ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్ఐఏ..స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఆర్మీ, సీఆర్పీఎఫ్,స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్  సైతం చేపట్టాయి. కాగా, రియాసీ జిల్లాలో భద్రత పరిస్థితులపై డీజీపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×