BigTV English
Advertisement

Land for Jobs Scam | లాలూ యాదవ్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు

Land for Jobs Scam | బిహార్ ప్రధాన రాజకీయ పార్టీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, బీహార్‌ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ (రైల్వే ఉద్యోగానికి బదులుగా భూమి) కేసులో డిసెంబర్ 22న తేజస్వీ యాదవ్ , 27న ఆయన తండ్రి లాలూ యాదవ్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

Land for Jobs Scam | లాలూ యాదవ్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు

Land for Jobs Scam | బిహార్ ప్రధాన రాజకీయ పార్టీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, బీహార్‌ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ (రైల్వే ఉద్యోగానికి బదులుగా భూమి) కేసులో డిసెంబర్ 22న తేజస్వీ యాదవ్ , 27న ఆయన తండ్రి లాలూ యాదవ్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.


ఈ కేసులో వ్యాపారవేత్త అమిత్‌ కత్యాల్‌ను నవంబర్ నెలలోనే ఈడీ అరెస్టు చేసింది. అమిత్‌ కత్యాల్‌కు లాలూ యాదవ్, తేజస్వీ యాదవ్‌కు సన్నిహిత సంబంధాలుడడంతో ఆయనను అరెస్టు చేసింది. అయితే బిహార్ ఉపముఖ్యమంత్రి
తేజస్వీ యాదవ్‌ను ఏప్రిల్‌ నెలలోనే ఈడీ విచారణ చేసింది. తాజాగా లాలూ ప్రసాద్‌తోపాటు మరోసారి తేజస్వీ కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదు కావడంతో ఇద్దరు నాయకుల వాదనలను ఈడీ రికార్డు చేయనుంది.


కాగా, 2004 నుంచి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగియాని ఆర్జేడీ నేతలపై సీబీఐ అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది.

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ముంబై, బీహార్‌, ఢిల్లీ నగరాలలో మొత్తం 25 చోట్ల ఈడీ సోదాలు చేసింది. తేజస్వీ యాదవ్ నివాసంతో పాటు ఆయన సోదరీమణులు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిపింది.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×