Pizza Restaurant Firing: పంజాబ్ లూథియానాలోని ఓ ప్రముఖ పిజ్జా సెంటర్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని దుండగులు రెస్టారెంట్లోకి చొరబడి కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే మూడు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రివేళ జరిగిన ఈ ఘటనతో కస్టమర్లతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
లుధియానాలో నిత్యం రద్దీగా ఉండే భాయ్ రణధీర్ సింగ్ నగర్ (BRS Nagar) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగులు లోపలికి వచ్చి కాల్పులు జరిపిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. తుపాకీ పేలిన వెంటనే లోపల ఉన్న కస్టమర్లు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Shots Fired at Ludhiana Pizza Outlet, Gang Claim Probed
New Delhi, August 19, 2026
A late-night firing at a pizza outlet in Ludhiana has triggered panic and raised fresh concerns over possible gang-related threats in the city. Unidentified assailants allegedly entered the… pic.twitter.com/ckLLCZwzjJ
— Yugvarta News Agency (@YugvartaNews) August 19, 2026
అయితే ఈ కాల్పులు తామే జరిపినట్లు ఓ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకుంది.’గోపీ లాహోరియా గ్రూప్’ పేరిట ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటిస్తూ ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. రెస్టారెంట్ను బెదిరిస్తూ పెట్టిన ఈ పోస్ట్తో ఈ దాడి వెనుక గ్యాంగ్స్టర్ల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
సోషల్ మీడియా పోస్ట్ వెలుగులోకి రావడంతో పోలీస్ సైబర్ సెల్ రంగంలోకి దిగింది. ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిజంగానే సదరు గ్యాంగ్కు చెందిందా? లేక భయాందోళనలు సృష్టించడానికి ఎవరైనా నకిలీ ఖాతాతో ఈ పని చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఆ ఖాతాను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: సీఎం విజయ్ బంపరాఫర్.. ఎమ్మెల్యేలకు ఉచిత కారు.. నెలకు రూ.లక్ష అలవెన్స్!
సీసీటీవీ విజువల్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ను కాల్పుల ఘటనకు కీలక ఆధారాలుగా పోలీసులు పరిగణిస్తున్నారు. దీని ఆధారణంగా విచారణ వేగవంతంగా చేశారు. అయితే ఈ కాల్పులు కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేసే కుట్రనా? లేక ఏదైనా ముఠా కక్షలా? అనే విషయాలు తేలాల్సి ఉంది. ఈ ఘటనతో లూథియానాలో గ్యాంగ్ కల్చర్, తుపాకుల సంస్కృతిపై మళ్లీ మెుదలైందా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!