Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఓ వ్యాన్ ఉధ్ధృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటుతున్న క్రమంలో నియంత్రణ కోల్పోయి నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన సమయంలో వ్యాన్లో మొత్తం 11 మంది ప్రయాణికులు ఉన్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సాయంతో కాలువలో మునిగిపోయిన వ్యాన్ను బయటకు తీసి, మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కాపాడి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేక వాహనంలో ఏమైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: 11 ఏళ్లుగా చక్రాల కుర్చీలోనే చిన్నారి.. సాయం కోసం ఎదురుచూస్తున్న కన్నపేగు!