BigTV English

Modi Letter to Sunita: సునీతా తిరుగు ప్రయాణంపై ప్రధాని ఆసక్తి.. వైరల్ అవుతున్న మోదీ లేఖ

Modi Letter to Sunita: సునీతా తిరుగు ప్రయాణంపై ప్రధాని ఆసక్తి.. వైరల్ అవుతున్న మోదీ లేఖ

భారత్ సహా ఇప్పుడు ప్రపంచం అంతా సునీతా విలియమ్స్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తన సహ వ్యోమగామి విల్మోర్ తో కలసి 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్.. ఎట్టకేలకు వ్యోమ నౌక ద్వారా తిరిగి భూమిపైకి వస్తోంది. అయితే ఆ ప్రయాణం సుఖాంతం కావాలని, సునీత సురక్షితంగా భూమిపై అడుగు పెట్టాలని ప్రపంచం ఆకాంక్షిస్తోంది. ఆమె భారత సంతతి మహిళ కావడంతో.. గుజరాత్ లోని ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెకోసం ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థనలన్నీ ఫలించాలని, ఆమె క్షేమంగా భూమిపైకి రావాలని ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన గతంలోనే సునీతా విలియమ్స్ కి ఓ లేఖ రాశారు. ఆ లేఖను ఆమెకు చేరవేసే బాధ్యతను వ్యోమగామి మైక్ మాసిమినోకి అప్పగించారు. మోదీ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సునీతా విలియమ్స్ భూమిపైకి బయలుదేరిన సమయంలో ఆ లేఖను సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఈ ఏడాది మార్చి-1న ప్రధాని సునీతా విలియమ్స్ కి లేఖ రాశారు. 140 కోట్లమంది భారతీయులు సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిపైకి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నట్టు ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో వ్యోమగామి మాసిమినోను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య సునీతా విలియమ్స్ ప్రస్తావన వచ్చినట్టు తన లేఖలో పేర్కొన్నారు. ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత తాను ఈ లేఖ రాయకుండా ఉండలేకపోయానని, అందుకే లేఖ రాసి దాన్ని మాసిమినో ద్వారా మీకు పంపిస్తున్నానంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనల్లో గత అధ్యక్షుడు బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని కలిసినప్పుడు కూడా సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై వాకబు చేసినట్టు తెలిపారు. ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఆ అంశాలను కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు.

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కి చెందిన వ్యక్తి. ఆమె తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశానికి చెందిన మహిళ. వారిద్దరికీ ముగ్గురు సంతానం. అందులో సునీతా విలియమ్స్ చిన్నవారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన సునీతా.. ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం వ్యోమగామిగా తన కెరీర్ ప్రారంభించారు. ప్రధాని మోదీ తన లేఖలో.. సునీతా తండ్రి దీపక్ పాండ్యాని కలిసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో అమెరికాలో తాను సునీతాతోపాటు ఆమె తండ్రిని కూడా కలిశానని గుర్తు చేసుకున్నారు. అయితే సునీతా తండ్రి ఇప్పుడు లేరు. ఆయన మరణం తర్వాత తల్లి బోనీ పాండ్యా సునీతతో ఉన్నారు. ఆమె రాకకోసం బోనీ పాండ్యా ఎదురు చూస్తుంటారని గుర్తు చేశారు ప్రధాని మోదీ. భారత దేశానికి చెందిన అత్యంత ప్రసిద్ధమైన కుమార్తె సునీతా విలియమ్స్ అని అన్నారు. భూమి నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్నా ఆమె భారతీయుల హృదయాలకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారని గుర్తు చేశారు.

ప్రధాని మోదీ రాసిన లేఖకు గతంలోనే సునీతా స్పందిచారు. ఆయనతోపాటు, భారత దేశానికి కూడా ఆమె కృతజ్ఞతల సందేశం పంపించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×