E-Paper
Advertisement

Mumbai: విషాదం.. క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి..

Mumbai: విషాదం.. క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి..
Advertisement
Mumbai news today

Mumbai news today(Today news paper telugu):

మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ.. 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అందుకు కారణం.. పక్కనే జరుగుతున్న మ్యాచ్ లో బాల్ వచ్చి అతని తలకు బలంగా తగలడమే. మాతుంగాలోని మైదాన్ లో ఈ ఘటన జరిగింది. గాయమైన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందిన వైద్యులు నిర్థారించినట్లు తోటి ఆటగాళ్లు తెలిపారు. అక్కడే ఉన్న మిగతా ఆటగాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. 50కి పైగా వయసున్న వ్యక్తుల కోసం.. కుచ్చివీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్ పేరిట ముంబైలో టీ20 టోర్నమెంట్ జరుగుతోంది.

టోర్నమెంట్ లో భాగంగా సోమవారం 2 మ్యాచ్ లను పక్కపక్క పిచ్ లపై నిర్వహించారు. సమయం ఎక్కువగా లేకపోవడం, ఇతర మైదానాలు అందుబాటులో లేకపోవడంతో ఇలాగే చేయాల్సి వచ్చింది. కానీ.. ఇందులో బాల్ తగిలి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని బాల్ తో కొట్టి చంపలేదని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×