E-Paper
Advertisement

Mumbai : భారత్ వాణిజ్య నౌకలపై దాడులు.. రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Mumbai: ఇండియాకు వస్తోన్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా ఖండించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. కార్గో షిప్పులపై వరుసగా దాడుల జరుగుతున్న నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. దీనికి కారణం అయిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Mumbai :  భారత్ వాణిజ్య నౌకలపై దాడులు..  రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Mumbai : ఇండియా వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.. కార్గో షిప్పులపై వరుసగా దాడుల జరుగుతున్న నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. దీనికి కారణం అయిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ ’ను ముంబై వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సమయంలో నౌకల దాడి అంశాన్ని రాజ్ నాథ్ ప్రాస్తావించారు. ఎంవీ కెమ్‌ ప్లూటో వాణిజ్య నౌకపై డ్రోన్‌తో దాడి జరగడం వాస్తవమేనని భారత నేవీ ప్రకటించింది. గుజరాత్‌ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్‌ ప్లూటో’పై డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టింది. ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ రక్షణతో ఆ వాణిజ్య నౌక ముంబై పోర్టుకి చేరుకుంది.

ఈ దాడి ఇరాన్‌ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్‌ ప్రకటించింది. అయితే, అమెరికా ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. అమెరికా ఆరోపణలలో వాస్తవం లేదని ఇరాన్ ప్రకటించింది. అంతకుముందు ‘ఎంవీ సాయిబాబా’ నౌకపైనా దాడి జరిగింది. ఈ పరిణామాలతో కేంద్రం హెచ్చరించింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×