E-Paper
Advertisement

Nara Lokesh @ Coimbatore: కోయంబత్తూరులో నారా లోకేష్.. అక్కడ ఎలక్షన్ వన్ సైడ్..!

Nara Lokesh @ Coimbatore: కోయంబత్తూరులో నారా లోకేష్.. అక్కడ ఎలక్షన్ వన్ సైడ్..!

Nara Lokesh Elections 2024 Campaign in Coimbatore: మరో వారం రోజుల్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇంకా ప్రచారానికి ఐదురోజులే ఉండడంతో కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తరపున ప్రచారం చేశారు టీడీపీ యువనేత నారా లోకేష్.

అన్నామలై పోటీ చేస్తున్న కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించారు నారా లోకేష్. అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలతోపాటు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అధికంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ముఖ్యంగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన నేత ప్రధాని నరేంద్రమోదీ అని చెప్పుకొచ్చారు. తమిళనాడు ప్రజల సేవ చేయడం కోసం ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి అన్నామలై అని గుర్తు చేశారు నారా లోకేష్.

ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి అన్నామలై అని చెప్పారు నారాలోకేష్. ఈ నియోజకవర్గం నుంచి తన మిత్రుడు గెలుపు ఖాయమని మనసులోని మాట బయటపెట్టారు. ఆయనకు మద్దతు ఇవ్వడానికి తాను ఇక్కడకు వచ్చానని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400పై చిలుకు సీట్లు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

అటు అన్నామలై మాట్లాడుతూ ప్రపంచ దేశాల నుంచి రకరకాల కంపెనీలు హైదరాబాద్‌కు తెచ్చిన ఘటన చంద్రబాబుకే దక్కిందన్నారు. ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందన్నా రు. తమిళనాడులో డీఎంకె చేస్తున్నట్లుగా ఏపీలోనూ అక్రమ కేసులు పెట్టి టీడీపీ అధినేతను అధికార పార్టీ అరెస్టు చేసిందన్నారు.

Also Read: దేశంలో అవినీతిపరులకు ‘మోదీ వాషింగ్ మెషిన్’ నుంచి క్లీన్ చిట్: రాహుల్ గాంధీ

ఏపీలోనూ ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తెలిపారు. ఏపీలో వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 19న జరగనున్న తొలివిడత ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున జరగనుంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×