BigTV English

Durga Pooja Violence| దుర్గామాత ఊరేగింపులో కాల్పులు.. ఒకరు మృతి, షాపులు, వాహనాలు దగ్ధం!

Durga Pooja Violence| దుర్గామాత ఊరేగింపులో కాల్పులు.. ఒకరు మృతి, షాపులు, వాహనాలు దగ్ధం!

Durga Pooja Violence| దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఊరేగింపులో హింస చెలరేగింది. ఈ హింసలో తుపాకీ కాల్పులు జరిగి ఒక వ్యక్తి మరణించగా.. నిందితులు వాహనాలు, షాపులకు నిప్పంటించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలలోని భైరాచ్ జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. భైరాచ్ జిల్లాలోని మహసీ మండలంలో ఆదివారం దసరా పండుగ ముగింపు వేడుకల్లో భాగంగా కొందరు దుర్గామాత ఊరేగింపు చేశారు. అయితే ఊరేగింపులో జోరుగా డీజె సంగీతం పెట్టారు. అలా ఊరేగింపు తీసుకెళ్లే మార్గంలో ముస్లిం జనాభా ఉన్న ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతానికి చేరుకోగానే ముస్లిం వర్గానికి చెందిన కొందరు ఊరేగింపు డీజె మ్యూజిక్ తగ్గించాలని చెప్పారు.

అలా చేయడం కుదరదని ఊరేగింపు వర్గం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి దాడులు జరిగాయి. ఇంతలో వెనుక నుంచి ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ తగిలి రామ్ గోపాల్ మిశ్రా అనే 22 ఏళ్ల ఒక వ్యక్తి మరణించగా.. కొందరికి గాయాలయ్యాయి. దీంతో గొడవలో హింస చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. గుర్తు తెలియని కొందరు పరిసరాల్లోని బైకులు, ఇళ్లు, షాపులకు నిప్పంటించారు.


Also Read: ఒక బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్లఫ్రెండ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి రక్తపాతమే

బుల్లెట్ గాయంతో పడిపోయిన రామ్ గోపాల్ మిశ్రాని ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు అతను చనిపోయాడని ధృవీకరించారు. దీంతో అతని కుటుంబం, మిత్రులు ఆస్పత్రి బయట నిరసన చేశారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆస్పత్రి బయటే నిరసన చేశారు. ఈ ఘటన గురించి తెలిసి జిల్లాలోని దుర్గామాత ఊరేగింపు చేసేవారందరూ నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు విగ్రహాలు నిమజ్జనం చేసేది లేదని నిరసనకు దిగారు.

ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పోలీస్ శాఖపై మండిపడ్డారు. దుర్గా మాత ఊరేగింపులో భద్రతగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

Related News

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×