BigTV English

India Pak War: పాక్ పగ.. ఉగ్రవాదులకు మద్దతుగా ఎదురుదాడికి సన్నాహాలు

India Pak War: పాక్ పగ.. ఉగ్రవాదులకు మద్దతుగా ఎదురుదాడికి సన్నాహాలు

India Pak War: ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ పాలకుల గుండెల్లో టన్నుల కొద్ది భయం స్టార్ట్ అయ్యింది. అయితే, భారత్ ఆర్మీ కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలు మీద మాత్రమే దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా.. భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింన విషయం తెలిసిందే. అయితే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం.. భారత్ మీద దుష్ప్రచారం చేయడానికి పూనుకుంటోంది. భారత్ దాడులను పిరికి చర్యగా అభివర్ణించిన పాక్ ప్రధాని షరీఫ్.. తమ సైన్యం కూడా త్వరలోనే ధీటుగా సమాధానం చెబుతోందని చెబుతున్నారు.


భారత్ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దాడులపై మసూద్ ఫ్యామిలీ స్టేట్ మెంట్ కూడా విడుదల చేసింది. ‘మృతిచెందిన వారిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని.. వారందరూ అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మాకు ఎంతో నష్టం చేశారు. ఈ త్యాగం వృథా కాదు. మా వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతోందని.. న్యాయం గెలుస్తుందని’ మసూద్ ఫ్యామిలీ తెలిపింది.

అయితే, భారతదేశంపై ప్రతీకార దాడులకు పాకిస్థాన్ సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన దేశంపై దాడి చేసేందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరి కొద్దిసేపట్లో ప్రధాని షెహబాజ్ ఫరీష్ పాకిస్థాన్ దేశ ప్రజలను ఉద్దేశించి మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు. దీంతో ఇండియా, దాయాది దేశం పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.


Also Read: NMDC Recruitment: డిగ్రీ, ఐటీఐతో 934 ఉద్యోగాలు, రేపే లాస్ట్ డేట్.. శాలరీ రూ.లక్షల్లో

మరోవైపు రెండు దేశాల యుద్దం వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలని ఇప్పటికే మోదీ సర్కార్ కూడా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ తరచూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×