Mock drill: హైదరాబాద్ లో మాక్ డ్రిల్ నిర్వహణకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాసేపట్లో మహానగరంలో మాక్ డ్రిల్ ప్రారంభం అవుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 50 ఏళ్ల తర్వాత వార్ సైరన మోగనుందని ఆయన చెప్పారు.
సాయంత్రం 4 గంటలకు 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుందని చెప్పారు. సైరన్ మోగినప్పుడు నగర ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. బయట ఉన్న వారు సురక్షత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. 15 నిమిషాల తర్వాత దీనికి సంబంధించిన మరో అలెర్ట్ వస్తుందని.. చెప్పారు. మోదీ సర్కార్ ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలు ఏపీలో విశాఖలో మాక్ డ్రిల్ కొనసాగనుంది.
Also Read: NMDC Recruitment: డిగ్రీ, ఐటీఐతో 934 ఉద్యోగాలు, రేపే లాస్ట్ డేట్.. శాలరీ రూ.లక్షల్లో
ఈ సైరన్ మోగిన వెంటనే ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తామని సీపీ ఆనంద్ చెప్పారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై అవగాహన కోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై మానసికంగా సన్నద్ధం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు.