BigTV English

PM Modi Women Safety: మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ

PM Modi Women Safety: మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ

PM Modi Women Safety| మహిళలపై జరిగే అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ జరగాలని, దోషులను చాల కఠినంగా శిక్షలు పడే విధంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంతో ప్రధాని మోదీ మహిళల భద్రత అంశం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు.


‘అత్యాచార ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు ఉంటాయని మీడియా ప్రజలకు చెప్పాలి. ఈ శిక్షల భయం తప్పు చేయాలనే వారిలో కలగాలి’ అని మోదీ తీవ్ర స్వరంతో అన్నారు. కోల్ కతా లో మహిళా డాక్టర్ హత్యాచార ఘటన సందర్భంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

మహిళలకు ఆర్థిక శక్తి
స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. అందుకోసం ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంద్నారు. ద్వాక్రా లాంటి స్వయం సహాయక ప్రభుత్వ పథకాలతో మహిళకు లబ్ది చేకూరుతోందని.. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మంది మహిళలు ఈ పథకాల్లో చేరరాని తెలిపారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలో, సమాజంలో మహిళలకు నిర్ణయం తీసుకునే శక్తి లభించిందని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ ఒక శుభవార్త చెప్పారు. ఉద్యోగం చేసే సమయంలో గర్భవతులైతే వారికి 12 నుంచి 26 వారాలపాటు మెటర్నిటీ సెలవు ప్రకటించారు.


Also Read: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన స్వాతంత్య్ర కోసం పోరాడిన అమర వీరులను, వారి త్యాగాలను గుర్తుచేశారు. దేశ అభివృద్ధి కోసం వికసిత్ భారత్ 2047 కోసం కృషి చేయాలని పౌరులకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు కోసం దేశఅభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు.

Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేసిన ప్రధాని మోదీ..

ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని దేశంలో 5జీ టెక్నాలజీని దేశంలో విజయవంతంగా అమలు చేశామని.. 6జీ టెక్నాలజీపై పనిజరుగుతోందని తెలిపారు. తయారీ రంగంలో దేశ నైపుణ్యతని కొనియాడారు. దేశంలోని ఐటి నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అద్భుతమైన గేమింగ్ ప్రాడక్ట్స్ తీసుకురావాలని, కొత్త ఉద్యోగాలు సృష్టించాలని.. గేమింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతి పెంచాలని సూచనలు చేశారు.

తయారీ రంగంలో హై క్వాలిటీ ప్రాడక్ట్స్ చేయడంలో భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతోందని.. భారత్ ఉత్పత్తులు ప్రామాణికంగా మిగతా దేశాలు అనుసరించే విధంగా నాణ్యమైన ఉత్తపత్తులను తయారు చేయాలని సూచించారు. అందుకు భారత దేశంలో కావాల్సిన టాలెంట్ ఉందని అన్నారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

 

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×