BigTV English

PM Modi Bangladesh Hindus: ‘బంగ్లాదేశ్ హిందువులు సురక్షితంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు’

PM Modi Bangladesh Hindus: ‘బంగ్లాదేశ్ హిందువులు సురక్షితంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు’

PM Modi Bangladesh Hindus| ఆగస్టు 15 స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి వరుసగా 11వ సారి ప్రసంగం చేశారు. ఢిల్లీ ఎర్రకోటలో ఆయన జాతీయ పతాకం ఎగుర వేసిన తరువాత చేసిన ప్రసంగంలో పొరుగుదేశం బంగ్లాదేశ్ సంక్షోభం గురించి ప్రస్తావించారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సామాన్య స్థాయికి త్వరగా చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల భారత పౌరులు బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన చెందుతున్నాని అన్నారు. బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామా, దేశ బహిష్కరణ తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో హిందువులు, మైనారిటీల హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.


”బంగ్లాదేశ్ లో సంక్షోభం గురించి ఒక పొరుగు దేశంగా భారత్ ఆందోళనగా ఉంది. అక్కడ పరిస్థితులు త్వరగా చక్కబడాలని ఆశిస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయులు బంగ్లాదేశ్ హిందువులు, మైనారిటీల సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. శాంతి, అభివృద్ధి మార్గంలో పొరుగు దేశాలు నడవాలని, బంగ్లాదేశ్ లో శాంతియుత వాతావరణం ఉండాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటోంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ వికాస్ యాత్ర.. అభివృద్ధి పథంలో నడవాలని, మానవజాతి సంక్షేమం కోసం కృషిచేసేందుకు భారత్ సహకారం చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేసిన ప్రధాని మోదీ..


అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ రాజ్య సభలో బంగ్లాదేశ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి వివరిస్తూ.. హిందువులు, మైనారిటీలపై దాడులు జరగడం ఆందోళనకరమని అన్నారు. బంగ్లాదేశ్ మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పరిశీలిస్తోందని.. సామాజిక సేవా సంస్థల ద్వారా వారి సాయం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగుదేశంలో పరిస్థితులు సామాన్య స్థితికి చేరుకునే వరకు దౌత్య పరంగా కృషి చేస్తామని చెప్పారు.

Also Read: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి

బంగ్లాదేశ్ లో హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై అల్లరిమూకలు దాడులు చేస్తున్నాయి. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటిరకు హిందువులపై 205 హింసాత్మక దాడులు జరిగినట్లు సమాచారం.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×