E-Paper
Advertisement

Rahul Gandhi: RSS దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది.. మోహన్ భగవత్‌ వ్యాఖ్యలపై రాహుల్ తీవ్ర విమర్శలు

Rahul Gandhi: RSS దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది.. మోహన్ భగవత్‌ వ్యాఖ్యలపై రాహుల్ తీవ్ర విమర్శలు

దేశ స్వాతంత్ర్యం, అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన గురించి RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలును కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన జరిగిన రోజునే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించిందని భగవత్ వ్యాఖ్యానించడం నిజంగా దురదృష్టకరం అన్నారు. ఆయన వ్యాఖ్యలను దేశ ద్రోహంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. RSS చీఫ్ మీద తీవ్రంగా మండిపడ్డారు.  దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. అందులో తమది రాజ్యాంగ సిద్దాంతం కోసం జరుగుతుంటే, మరొకటి RSS భావజాల సిద్దాంతం కోసం జరుగుతుందన్నారు. “ప్రస్తుతం దేశంలో రెండు సిద్దాంతాల నడుమ యుద్ధం జరుగుతున్నది. ఒకటి రాజ్యాంగ సిద్దాంతం కోసం జరుగుతుంటే, మరొకటి RSS సిద్దాంతం కోసం పని చేస్తున్నది. తాము రాజ్యంగం కోసం పోరాడుతుంటే, బీజేపీ RSS కోసం పోరాడుతున్నది. రామ మందిరం ప్రతిష్టాపన రోజే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పడం నిజంగా స్వాతంత్ర్య సమరయోధులను కించపరచడమే అవుతుంది. ఆంగ్లేయుల వారి మీద పోరాడిన సమరయోధునలను భగవత్ తక్కువ చేసి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు నిజంగా దేశద్రోహం కిందికి వస్తాయి. ఇకపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి” అని రాహుల్ సూచించారు.

దేశ విచ్ఛిన్న శక్తులను ఎదుర్కొనేది కాంగ్రెస్ ఒక్కటే!

కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగానికి, పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందన్న ఆయన, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తామన్నారు. అటు ఎన్నికల కమిషన్ సైతం అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తుందని రాహుల్ విమర్శించారు. లోక్ సభ ఎలక్షన్స్ తో పోల్చితే అసెంబ్లీ సమయానికి మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఓట్లు పెరిగాయన్నారు. ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలంటే సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ సూచించారు.

Read Also: లద్దాఖ్ లో చైనా కాలుదువ్వుతోంది.. దాని కోరలు పీకాల్సిందే.. భారత ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన

కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సోనియా గాంధీ

ఢిల్లీలో నిర్మించిన నూతన కాంగ్రెస్ కార్యాలయం ఇవాళ ప్రారంభం అయ్యింది. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రారంభించారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.

Read Also: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త చిరునామా.. 47 ఏళ్ల తరువాత మూతపడిన పాత కార్యాలయం

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×