E-Paper
Advertisement

Russia Woman Indian Forest: 2 పిల్లలతో కర్ణాటక అడవుల్లో ఒంటరిగా రష్యా మహిళ.. అటవీ అధికారులు చూసి షాక్

Russia Woman Indian Forest: 2 పిల్లలతో కర్ణాటక అడవుల్లో ఒంటరిగా రష్యా మహిళ.. అటవీ అధికారులు చూసి షాక్
Advertisement

Russia Woman Indian Forest| కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండ ప్రాంతంలోని ఒక గుహలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. ఆ అడవి ప్రాంతంలో ఆమె గత 8 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమె వీసా గడువు ముగిసిపోయాక రష్యా వెళ్లకుండా దొంగచాటుగా అడవుల్లోనే ప్రకృతి జీవనం సాగిస్తోంది.

రష్యన్ మహిళ నీనా కుటినా (40) తన ఇద్దరు కూతుళ్లు.. వయసు నాలుగు సంవత్సరాలు, ఆరు సంవత్సరాలతో ఒంటరిగా గత ఎనిమిది సంవత్సరాలుగా అడవుల్లో దాక్కుంటూ జీవించింది. ఆమె వీసా 2017లో ముగిసినప్పటికీ, భారతదేశాన్ని విడిచిపెట్టకుండా, అడవుల్లో జీవనం సాగించింది.

Advertisement

నీనా 2016లో భారతదేశానికి వ్యాపార వీసాపై వచ్చింది. గోవా, కర్ణాటక గోకర్ణలలో ఆమె పర్యాటక, రెస్టారెంట్ వ్యాపారాల పట్ల ఆకర్షితురాలైంది. కానీ, 2017లో ఆమె వీసా గడువు ముగియడంతో ఆమె దేశం విడిచి వెళ్లకుండా, కర్ణాటక తీరప్రాంత అడవుల్లో దాక్కుంది. 2018లో ఎగ్జిట్ పర్మిట్ తీసుకొని నేపాల్‌కు వెళ్లినప్పటికీ, మళ్లీ భారతదేశానికి తిరిగి వచ్చి కర్ణాటక అడవి ప్రాంతంలోని గుహల్లో నివసిస్తోంది.

ఆమెకు అడవులు, ధ్యానం, దేవతల పూజలు ఎంతో ఇష్టం. హోటళ్లకు వెళితే.. ఆమె వీసా ముగిసిన విషయం బయటపడుతుందనే భయంతో ఆమె అడవుల్లోనే శాశ్వతంగా ఉండడానికి ఇష్టపడింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు భారతదేశంలోనే జన్మించారు, కానీ వారి తండ్రి గురించి ఆమె ఏమీ చెప్పలేదు. ప్రసవ సమయంలో ఆమెకు వైద్య సహాయం ఎవరు అందించారు.. అనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Advertisement

పోలీసులు రామతీర్థ కొండల్లో సాధారణంగా తనిఖీలు చేస్తున్నప్పుడు.. గుహ వైపు వెళ్లే అడుగుజాడలు కనిపించాయి. గుహ దగ్గర ప్లాస్టిక్ కవర్, దేవతల ఫోటోలు ఉన్నాయి. లోపలికి వెళ్లగా, ఒక బిడ్డ ఆడుకుంటూ, నీనా ఆమె మరో కూతురు నిద్రిస్తూ కనిపించారు. గత రెండు నెలలుగా వారు ఆ గుహలోనే ఉంటున్నారని తెలిసింది.

పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్.. వర్షాకాలంలో కొండ ప్రమాదం ఉందని నీనాను బయటకు రమ్మని ఒప్పించారు. పాముల గురించి హెచ్చరించినప్పుడు, ఆమె “పాములు మా స్నేహితులు, మేము వాటిని ఇబ్బంది పెట్టనంత వరకు అవి మాకు హాని చేయవు” అని చెప్పింది. ఆమె తన పిల్లలతో జలపాతాల దగ్గర స్నానం చేసేటప్పుడు పాములు సమీపంలో ఉన్నప్పటికీ హాని చేయలేదని చెప్పింది.

గుహలో సరిపడా కిరాణా సామాగ్రిని నీనా నిల్వ చేసింది. కొవ్వొత్తులు ఉన్నప్పటికీ.. వారు సహజ కాంతిని ఆశ్రయించారు. ఆమె ఫోన్‌ను అప్పుడప్పుడు ఛార్జ్ చేసేది, కానీ చాలా అరుదుగా ఉపయోగించేది. ఆమె పిల్లలను గోకర్ణ లేదా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి తిరిగి గుహకు వచ్చేది. ఆమె పిల్లలకు డ్రాయింగ్, గానం, యోగా, మంత్రాలు నేర్పించేది.

ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. తన 18 ఏళ్ల సర్వీసులో ఇలాంటి మహిళను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. “సాధారణంగా యువకులు లేదా సాధువులు అడవుల్లో ఉంటారు, కానీ చిన్న పిల్లలతో ఒక తల్లి ఇలా జీవించడం చూడలేదు. వారు ఆరోగ్యంగా, స్థిరంగా ఉన్నారు. ఆమె పాస్‌పోర్ట్ గుహ సమీపంలో దొరికింది. ఆమెను రష్యాకు డిపోర్ట్ చేసే ప్రక్రియ బెంగళూరులో ప్రారంభమవుతుంది.” అని అన్నాడు.

Also Read: ₹1712 కోట్ల భారీ వేతనం.. ఆపిల్ టాప్ ఇంజినీర్‌కు మెటా బంపర్ ఆఫర్

వీసా ఉల్లంఘనల కారణంగా పోలీసులు నీనా, ఆమె పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని నీనా రష్యన్ భాషలో బాధతో తెలిపింది. “మా గుహ జీవనం ముగిసింది. మా సౌకర్యవంతమైన ఇల్లు ధ్వంసమైంది. ఇప్పుడు మేము ఆకాశం, గడ్డి, జలపాతం లేని జైలులో ఉన్నాము,” అని రాసింది.

 

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×