BigTV English
Advertisement

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. కస్టడీలో ఉన్న నిందితుడు సూసైడ్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. కస్టడీలో ఉన్న నిందితుడు సూసైడ్

Salman khan house fire news(Today latest news telugu): బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దాడిపై ముంబై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఓ వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండి తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.


సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుల్లో ఒకరైన అనూజ్ తపన్ అనే 32 ఏళ్ల వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అనూజ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్థారించారు. అయితే మృతుడు అనూజ్ తపన్ ది పంజాబ్ అని.. ఏప్రిల్ 16న ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


గత నెల 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: ఢిల్లీలో తీవ్ర కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

సీసీటీవీల ఆధారంగా గుజరాత్ లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విక్కీ గుప్తా, సాగర్ పాల్ లు కాల్పులు జరిపిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరికి ఆయుధాలను సరఫరా చేశారన్న ఆరోపణలతో అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×