E-Paper
Advertisement

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. కస్టడీలో ఉన్న నిందితుడు సూసైడ్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. కస్టడీలో ఉన్న నిందితుడు సూసైడ్

Salman khan house fire news(Today latest news telugu): బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దాడిపై ముంబై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఓ వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండి తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుల్లో ఒకరైన అనూజ్ తపన్ అనే 32 ఏళ్ల వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అనూజ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్థారించారు. అయితే మృతుడు అనూజ్ తపన్ ది పంజాబ్ అని.. ఏప్రిల్ 16న ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

గత నెల 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: ఢిల్లీలో తీవ్ర కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

సీసీటీవీల ఆధారంగా గుజరాత్ లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విక్కీ గుప్తా, సాగర్ పాల్ లు కాల్పులు జరిపిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరికి ఆయుధాలను సరఫరా చేశారన్న ఆరోపణలతో అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×