BigTV English
Advertisement

Haryana News: కారులో ఏడుగురి మృతదేహాలు.. హత్యా? ఆత్మహత్యా? గుట్టు విప్పే పనిలో పోలీసులు

Haryana News: కారులో ఏడుగురి మృతదేహాలు.. హత్యా? ఆత్మహత్యా? గుట్టు విప్పే పనిలో పోలీసులు

Haryana News: హర్యానాలోని పంచకుల ప్రాంతంలో పార్కింగ్ చేసిన కారులో ఏడుగురు మృతదేహాలు కనిపించాయి. ఆత్మహత్య పాల్పడిన వారంతా ఒకే కుటుంబంలోని సభ్యులు. అప్పుల బాధల వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పంచకుల పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్. ఆయన వయస్సు సుమారు 42 ఏళ్లు ఉండవచ్చు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి హర్యానాలోని పంచకులలో బాగేశ్వర్ ధామ్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం కార్యక్రమం ముగించుకున్నారు. తిరిగి సొంతూరు డెహ్రాడూన్‌కు వెళ్తున్నారు. మరి ఏం జరిగిందో తెలీదు.

పంచకులలోని సెక్టార్ 27లోని ఓ ఇంటి బయట లాక్ చేసిన కారులో మృతదేహాలు కనిపించాయి. ఒకే కారులో ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడంతో సంచలనంగా మారింది. పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.


ఆ కుటుంబం కారులోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. భారీ అప్పులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 42 ఏళ్ల ప్రవీణ్ మిట్టల్, అతని భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. అలాగే మిట్టల్ తల్లిదండ్రులు ఉన్నారు. ఫోరెన్సిక్ టీమ్ కారు వద్దకు చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడింది.

ALSO READ: పెళ్లిలో అతిథులపై హిజ్రాల దాడులు.. వరుడు కిడ్నాప్

ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే అందులోని విషయాలు బయటకు వెల్లడించలేదు. దర్యాప్తులో వాటి గురించి వెల్లచడం కరెక్టు కాదని అధికారులు చెప్పారు. పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ ఈ విషాద ఘటన స్థానికుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పంచకుల పోలీసులు ఈ కేసును చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తు తర్వాతే ఈ కేసుకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు బయటపడతాయని అన్నారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రత్యక్ష సాక్షుల వెర్షన్ మరోలా ఉంది. ఓ కుటుంబమంతా కారులో ఉండడం తాను గమనించానని తెలిపాడు. కారు లోపల వారు ఇబ్బంది పడుతుండటం చూసి స్థానికులకు చెప్పినట్టు వివరించాడు. ఒకరిపై ఒకరు వాంతులు చేసుకున్నట్లు వెల్లడించాడు. తాను చూసే సమయానికి ఒకరు మాత్రమే ఊపిరి పీల్చుకుంటున్నారని, మిగిలిన వారంతా అపస్మారక స్థితిలో ఉన్నట్లు చెప్పాడు.

కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానికుల సాయంతో బయటకు తీస్తుండగా అందరం విషం తాగామని, ఐదు నిమిషాల్లో చనిపోతామని చెప్పిన మాటలను గుర్తు చేశాడు. తాము అప్పుల్లో మునిగిపోయామని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పినట్టు తెలిపాడు. పోలీసులు అక్కడికి రావడం, అర గంట తర్వాత అంబులెన్స్ వచ్చిందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×