E-Paper
Advertisement

Chhattisgarh Maoists Encounter: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు హతం!

Chhattisgarh Maoists Encounter: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు హతం!
Advertisement

12 Maoists Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. కూబింగ్ చేస్తుండంగా పోలీసులకు ఒక్కసారిగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాగా, ఈ కాల్పుల్లో 12 మంది మావోలు హతమయ్యారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు పక్కా సమాచారంలో వారిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.

బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అడవుల్లో మావోలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బలగంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగగా మావోయిస్టులు మృతి చెందగా.. బలగాలకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: National Technology Day 2024: నేడు నేషనల్ టెక్నాలజీ డే.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

కాగా, గత కొన్ని రోజులుగా మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్ చేసుకుని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పిడియా గ్రామ పరిసరాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గత నెల 16వ తేదీన కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఆ ఘటన ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన కావడం విశేషం. దీంతో పాటుగా గత నెల 30వ తేదీన నారాయణ్ పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోలకు కాల్పులు జరగగా.. 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×