E-Paper
Advertisement

350 Voters in Family: ఒక్క కుటుంబం.. ఐదుగురు భార్యలు.. 350 మంది ఓటర్లు!

350 Voters in Family: ఒక్క కుటుంబం.. ఐదుగురు భార్యలు.. 350 మంది ఓటర్లు!
Advertisement

350 Voters in Family: ఒక కుటుంబం. ఆ కుటుంబంలో 1200 మంది సభ్యులు. వారిలో 350 మంది ఓటర్లు. వీరంతా ఏప్రిల్ 19న జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ.. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రస్తుతం ఈ కుటుంబం గురించే యావత్ దేశం మాట్లాడుకుంటోంది. అసోంలోని సోనిట్ పూర్ జిల్లో ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఉందీ కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్న ఓటర్లే ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తారనడంలో అతిశయోక్తి లేదు.

1964లో అసోంలో స్థిరపడిన దివంగత రాన్ బహదూర్ థాపాకు ఐదుగురు భార్యలు. వారందరికీ 12 మంది కుమారులు, 9 మంది కుమార్తెలు ఉన్నారు. వాళ్లందరికీ పెళ్లిళ్లై పిల్లలు పుట్టి.. ఆ పిల్లలకు పెళ్లిళ్లై 150 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. అలా థాపా వంశం ఇప్పుడు 1200 మందితో ఉంది. వారిలో 350 మంది ఓటర్లు ఉన్నారు. కానీ.. తమ కుటుంబం ఇప్పుడు ఆర్థిక సవాళ్లతో పోరాడుతోందని రాన్ బహదూర్ కుమారుడు టిల్ బహదూర్ థాపా తెలిపాడు.

Advertisement

తమ కుటుంబంలో పిల్లలకు సరైన విద్య, ఉపాధి కూడా దొరకడం లేదని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని మరొక కుమారుడు సర్కి బహదూర్ థాపా తెలిపారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో సోనిట్ పూర్ లో రాజకీయనేతలంతా ఆ ఇంటికి క్యూ కడుతున్నారు. తమకే ఓటు వేయాలంటే తమకే వేయాలంటూ ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు.

Also Read: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావన లేదు.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఫైర్..

Advertisement

అసోంలో 14 లోక్ సభ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది. సోనిట్ పూర్ లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 16 లక్షల 25 వేల మంది ఓటర్లున్నారు.

Related News

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

Big Stories

Advertisement
×