BigTV English
Advertisement

Oppositions on BJP Manifesto: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావన లేదు.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఫైర్

Oppositions on BJP Manifesto: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావన లేదు.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఫైర్

Opposition Parties Attack on BJP Manifesto: రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఆదివారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ఎన్నికల పత్రంలో చేసిన వాగ్దానాలు అబద్ధాలతో నిండి ఉన్నాయిని.. విశ్వసనీయతను కోల్పోయేలా ఉన్నాయని ఆరోపించాయి. మేనిఫెస్టోలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని కాషాయ పార్టీ పట్టించుకోలేదని విమర్శల వర్షం గుప్పించాయి.


బీజేపీ మేనిఫెస్టోలో పేదలు, యువకులు, రైతులు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల పత్రాన్ని విడుదల చేస్తూ, తమ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, బీజేపీ మేనిఫెస్టోలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కనిపించడం లేదన్నారు.


“ప్రజల జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను చర్చించడానికి కూడా బీజేపీ ఇష్టపడదు. ఇండియా కూటమి ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది – 30 లక్షల పోస్టులకు రిక్రూట్‌మెంట్, చదువుకున్న ప్రతి యువకుడికి 1 లక్ష రూపాయల పర్మినెంట్ ఉద్యోగం” అని ఆయన ట్వీట్ చేశారు.

Also Read: CJI: న్యాయ వ్యవస్థలను అణగదొక్కాలని చూస్తున్నారు.. సీజేఐకు మాజీ జడ్జీల లేఖ

ఈసారి యువత ప్రధాని మోదీ ట్రాప్‌లో పడబోదని, ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌ చేతులను బలోపేతం చేసి దేశంలో ఉపాధి విప్లవాన్ని తీసుకొస్తారని అన్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, బీజేపీ మేనిఫెస్టో ఒక బూటకం అని, వారి నిజమైన మేనిఫెస్టో ‘సంవిధాన్ బద్లో పాత్ర’ (రాజ్యాంగాన్ని మార్చే మేనిఫెస్టో) అని ఆరోపించారు.

‘‘దేశం, సమాజం, ప్రజాస్వామ్యంపై బీజేపీ ఈ కుట్రలన్నీ అట్టడుగు నుంచి ప్రారంభిస్తుందని గుర్తుంచుకోండి.. మొదట్లో అగ్రనేతలు ప్రజల ముందు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు, కానీ రాత్రికి రాత్రే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు స్క్రిప్ట్ రాస్తారు. ఆ తర్వాత పూర్తి అధికారం దక్కిన తర్వాత రాజ్యాంగంపై దాడికి దిగుతారు’’ అని ఆమె ఆరోపించారు.

Also Read: 350 Voters in Family : ఒక్క కుటుంబం.. ఐదుగురు భార్యలు.. 350 మంది ఓటర్లు

బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశ ఆత్మ అని, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆమె అన్నారు.

“ఈరోజు మనమందరం ఏకమై బీజేపీ రాజ్యాంగ మార్పు మిషన్‌ను తిరస్కరించాలి. దేశం రాజ్యాంగం ద్వారానే నడుస్తుందని గట్టిగా చెప్పాలి. రాజ్యాంగాన్ని మార్చాలని భావించేవారిని మనం కలిసి ఓడిస్తాము” అని ఆమె ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎలాంటివి చేయలేదని ఆరోపించారు. బీజేపీ మేనిఫెస్టోను కూడా నమ్మలేమని అన్నారు.

Also Read: Rahul’s helicopter checking: రాహుల్ చాపర్‌లో తనిఖీలు, ఏం జరిగింది?

“రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఆయన (పీఎం నరేంద్ర మోదీ) చెప్పారు. ఎంఎస్‌పీ పెంచుతామని, లీగల్ గ్యారెంటీ ఇస్తానని చెప్పారు- ఇదీ హామీ. ఆయన హయాంలో అంత పెద్ద పని ఏమీ చేయలేదు. దేశంలోని ప్రజలందరికీ” అని ఆయన అన్నారు.

బీజేపీ మేనిఫెస్టో ‘జుమ్లా పాత్ర’ (నకిలీ వాగ్దానాల పత్రం) అని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని ఢిల్లీ మంత్రి అతిషీ నొక్కి చెప్పారు.

Also Read: PM Modi on BJP Manifesto: పేదల జీవితాలను మార్చడమే మోదీ ఇస్తున్న గ్యారంటీ..!

“నిరుద్యోగంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. (ఎల్‌పీజీ) సిలిండర్ల ధర రూ. 300 నుంచి రూ.1,200కి పెరిగింది. డీజిల్ ధర రూ. 55 నుంచి రూ. 90కి పెరిగింది. ప్రతి కుటుంబం ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతోంది. ఈరోజు బీజేపీ విడుదల చేసిన ఈ జుమ్లా పత్రాన్ని ఇప్పుడు ఎవరూ నమ్మరు’’ అని ఆమె అన్నారు.

ఇదే విధమైన భావాలను వ్యక్తం చేస్తూ, బీజేపీ తన మ్యానిఫెస్టోలో ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టలేదని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ విమర్శించారు.

Also Read: BJP Manifesto Released: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఇవే ప్రధాన అంశాలు!

“సామాన్యులు ద్రవ్యోల్బణం భారంతో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గ్రామీణ దుస్థితికి సూచిక అయిన MNREGA బడ్జెట్ గత 10 సంవత్సరాల్లో రూ. 33,000 కోట్ల నుంచి దాదాపు రూ. 90,000 కోట్లకు చేరుకుందని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు,” అని తివారీ పేర్కొన్నారు.

“కాబట్టి, ప్రజలను కలవరపెడుతున్న వాస్తవ సమస్యలు ఉన్నాయి. మైదానంలో ఉన్న అసంతృప్తి ఎన్‌డీఏ, బీజేపీకి ఎన్నికల ఓటమిని డిసైడ్ చేస్తుంది” అని ఆయన అన్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×