E-Paper
Advertisement

Union AYUSH Minister: త్వరలో ప్రత్యేక మెడికల్ స్టోర్స్ ప్రారంభిస్తాం..కేంద్ర మంత్రి

Union AYUSH Minister: త్వరలో ప్రత్యేక మెడికల్ స్టోర్స్ ప్రారంభిస్తాం..కేంద్ర మంత్రి
Advertisement

Union AYUSH Minister said Special Medical stores: దేశంలోని ప్రతీ తహసీల్‌లో ఆయుష్ ఔషధాలు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మెడికల్ స్టోర్లను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ వెల్లడించారు. అందరికీ ఈ ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉంచే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఆయుర్వేద ఔషధాలకు మంచి గుర్తింపు లభించేలా చొరవ తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇందౌర్, దేవాస్, ఉజ్జయినిలలో వైద్య సంస్థలను సందర్శించారు. అనంతరం అక్కడి సౌకర్యాలను తెలుసుకున్నారు. ఈ మేరకు అన్ని చోట్లా ఆయుష్ ఆస్పత్రులు అందుబాటులో ఉండాలన్నారు.

Advertisement

ఆయుర్వేదానికి సంబంధించిన సంప్రదాయం జ్ఞానం తరతరాలు వస్తోందని, ఒక తరం నుంచి మరో తరానికి అందుతుందన్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, అయితే గుర్తింపు లభించలేదన్నారు. ప్రస్తుతం ఈ విలువైన ఔషధాలు కొన్ని సాధారణ మెడికల్ దుకాణాల్లో మాత్రమే ఉన్నాయన్నారు.

ఆయుష్ మందులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండడంతో మందులను సూచించే వైద్యులు సైతం వాటిని రాయడం లేదన్నారు. దీంతో అటు రోగులతో పాటు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Advertisement

Also Read: పరాటాలో ప్లాస్టిక్ వైర్.. రూ. 10 లక్షల జరిమానా !

పరిశోధన తర్వాత ఆయుష్ మందులు అన్ని మెడికల్ దుకాణాల్లోకి అందుబాటులోకి రావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఆయుష్ మందులు ప్రతీ చోట ఉండాలని, అందుకే దేశంలోని ప్రతి తహసీల్‌లో ఆయుష్ మందుల ప్రత్యేక మెడికల్ స్టోర్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×