E-Paper
Advertisement

Viral News: ఏటీఎం సెంటర్ కు వచ్చిన వరాహం.. జెట్ స్పీడ్ తో వచ్చి.. తన పని కానిచ్చేసింది.. ఏం జరిగిందంటే?

Viral News: ఏటీఎం సెంటర్ కు వచ్చిన వరాహం.. జెట్ స్పీడ్ తో వచ్చి.. తన పని కానిచ్చేసింది.. ఏం జరిగిందంటే?
Advertisement

Viral News: సాధారణంగా ఏటిఎం సెంటర్ లోకి మనం వెళ్లి డబ్బులు డ్రా చేస్తూ ఉంటాం. కానీ ఈ ఏటిఎం సెంటర్ కి ఓ వరాహం (పంది) వచ్చింది. డబ్బులు డ్రా చేయడానికి మాత్రం కాదండోయ్.. అసలు జెట్ స్పీడ్ లో వచ్చిన ఆ వరాహాన్ని చూసి, అక్కడి స్థానికులు పరార్. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో..

ఏటిఎం సెంటర్ కు వెళ్లామంటే, మనకు అత్యవసర అవసరం ఉండాల్సిందే. అలా ఏటిఎం కార్డు ఉంచడం, ఇలా డబ్బులు తీసుకోవడం ఇదే పరిపాటి. కానీ ఈ ఏటిఎం సెంటర్ కు వచ్చిన వరాహం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఏటిఎం సెంటర్ల సమీపంలో ఎక్కువగా శునకాలు సంచరిస్తూ ఉంటాయి. సెక్యూరిటీ గార్డు లేకుంటే మాత్రం ఎంచక్కా సైలెంట్ గా ఓ కునుకు కూడా వేస్తుంటాయి శునకాలు.

Advertisement

కానీ ఇక్కడ ఓ వరాహమే ఏకంగా ఏటిఎం సెంటర్ లోకి దూరింది. కేరళలోని కొట్టాయం లో గల ఓ ఏటిఎం సెంటర్ వద్దకు వృద్దుడు వచ్చారు. తన ఏటిఎం కార్డు తీసి, నగదు విత్ డ్రా చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. అలా తన పని తాను చేసుకుంటుండగా, ఒక్కసారిగా ధడేల్ మని శబ్దం. ఇంకేముంది అసలేం జరుగుతోందో అర్థం కాని స్థితి ఆ వృద్ధుడిది.

అలా వెనక్కి తిరిగారో లేదో వృద్దుడి గుండె గుభేల్ మన్నది. ఎక్కడైనా వరాహాన్ని చూస్తే శునకాలు వెంటపడి మరీ వేటాడుతాయి. అలా శునకాలు వెంటపడ్డాయో ఏమో కానీ, ఓ వరాహం ఏటిఎం అద్దాలను ధ్వంసం చేసి మరీ లోనికి ప్రవేశించింది. అప్పటికే ఏటిఎం లోపల గల వృద్దుడు షాక్ తిని, అక్కడి నుండి పరుగో పరుగు. ఏటిఎం అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం అందుకున్న ఏటిఎం సిబ్బంది రంగంలోకి దిగారు.

Advertisement

Also Read: Chennai Crime : తమిళనాడులో నిలిచిన వైద్య సేవలు.. ఒక్కడి కారణంగా నిరసనలు.. ఏం జరిగిందంటే.?

అసలేం జరిగిందో తెలుసుకొనేందుకు ఏటిఎం సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో రికార్డైన వీడియో ద్వారా అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారట సిబ్బంది. కారణం ఏంటంటే ఎవరైనా దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారా అని అనుమానించిన వారికి ఫుటేజ్ ద్వారా వరాహం చేసిన విధ్వంసం అంటూ తెలిసింది. ఇక చేసేదేమిలేక ఏటిఎం అద్దాలు సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు వారు.

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×