BigTV English
Advertisement

Bengal HC on Sandeshkhali Incident: ఒక శాతం నిజమైనా..సిగ్గుచేటే: సందేశ్‌ఖాలీ ఘటనపై హైకోర్టు సీరియస్..!

Bengal HC on Sandeshkhali Incident: ఒక శాతం నిజమైనా..సిగ్గుచేటే:  సందేశ్‌ఖాలీ ఘటనపై హైకోర్టు సీరియస్..!
West Bengal High Court On Sandeshkhali Incidents
West Bengal High Court On Sandeshkhali Incidents

West Bengal High Court On Sandeshkhali Incident: సందేశ్‌ఖాలీలోని మహిళలపై లైంగిక వేధింపు ఆరోపణలకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్‌లోని విషయాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కలకత్తా హైకోర్టు గురువారం “కేసు ఒక్క శాతం నిజం అయినా, అది పూర్తిగా సిగ్గుచేటు” అని పేర్కొంది.


సందేశ్‌ఖాలీలో మహిళలపై హింస, భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం మమతా సర్కార్‌పై మండిపడ్డారు. “మొత్తం జిల్లా పరిపాలన, పాలక యంత్రాంగం నైతిక బాధ్యత వహించాలి. ఇది 1% నిజం అయినా అది పూర్తిగా సిగ్గుచేటు. మహిళలకు అత్యంత సురక్షితమైనదని పశ్చిమ బెంగాల్ చెబుతోంది కదా? ఒక అఫిడవిట్ సరైనదని రుజువైతే ఇవన్నీ పడిపోతాయి.” అని న్యాయమూర్తి దీదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్త చేశారు.

కాగా ఈ పిటిషన్లపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుపాకీతో మహిళలను బెదిరించి.. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న దావాలు, సందేశ్‌ఖాలీలో గిరిజనుల భూమిని ఆక్రమించిన ఆరోపణలపై ఫిబ్రవరిలో హైకోర్టు సుమోటాగా విచారణ చేపట్టింది.


జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జరిగిన దాడితో పాటు ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ కస్టడీపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయాలని మార్చిలో ఆదేశించింది.

Also Read: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించండి.. ప్రభుత్వానికి బెంగాల్ హైకోర్టు ఆదేశం..

TMC నుంచి సస్పెండ్ అయిన జిల్లా పరిషత్ సభ్యుడు షాజహాన్ షేక్‌పై జనవరి 5 న రైడ్స్ చేయడానికి సందేశ్‌ఖాలీకి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షాజహాన్, అతని సన్నిహితులు పరారీలో ఉండటంతో, ఫిబ్రవరి 8న, స్థానిక TMC నాయకులపై లైంగిక వేధింపులు, దాడులు, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పాట్రాతో సహా పలు ప్రాంతంలోని మహిళలు వీధుల్లోకి వచ్చారు.

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×