E-Paper
Advertisement

Sandeshkhali: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించండి.. ప్రభుత్వానికి బెంగాల్ హైకోర్టు ఆదేశం..

Sandeshkhali: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించండి.. ప్రభుత్వానికి బెంగాల్ హైకోర్టు ఆదేశం..

sandeshkhali incident newsHigh Court Orders Bengal Government to Hand Over Shahjahan Sheikh To CBI: బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో దోపిడీ, భూకబ్జా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణముల్‌ నాయకుడు షేక్‌ షాజహాన్‌ కస్టడీని కలకత్తా హైకోర్టు మంగళవారం సీబీఐకి అప్పగించింది. షాజహాన్, సంబంధిత కేసు సామాగ్రిని సీబీఐకు అప్పగించడానికి బెంగాల్ పోలీసులకు సాయంత్రం 4.30 గంటల వరకు సమయం కేటాయించింది.

బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ ఉత్తర్వును సవాలు చేయడానికి పావులు కదిపింది. అయితే తక్షణ విచారణ కోసం దాని అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం, రిజిస్ట్రార్ జనరల్ ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరింది.

సీబీఐ, రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం పక్కనపెట్టి, కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర ప్రభుత్వం రెండూ వేర్వేరు సవాళ్లను దాఖలు చేశాయి. సీబీఐకి మాత్రమే అప్పగించాలని ఈడీ కోరగా.. పోలీసులు దర్యాప్తును నిర్వహించాలని రాష్ట్రం కోరింది.

Read More: Sandeshkhali case: టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్.. 10 రోజుల పోలీసు కస్టడీ..

షేక్ షాజహాన్ జనవరి 5 నుంచి పరారీలో ఉన్నాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం దాడులు నిర్వహించడానికి దారిలో ఉండగా అతని మద్దతుదారుల గుంపు ఈడీ అధికారులపై దాడి చేసింది. ఈడీ అధికారులపై దాడి, షాజహాన్ అదృశ్యం భారీ రాజకీయ రగడకు దారితీసింది. అధికార తృణముల్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ తనను కాపాడుతోందని ఆరోపించింది.

55 రోజులపాటు పరారీలో ఉన్న షాజహాన్‌ను ఎట్టకేలకు ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. దీంతో ఆరేళ్లపాటు తృణముల్ షాజహాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. షాజహాను అరెస్టు చేయాలని బెంగాల్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు రోజుల అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Read More:  దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

తృణమూల్ మాజీ నాయకుడు, మమతా బెనర్జీ సన్నిహితుడు బీజేపీ నాయకుడు సువేందు అధికారి “ఇది అరెస్టు కాదు; ఇది పరస్పర సర్దుబాటు” అని ప్రకటించారు.

గత వారం బెంగాల్‌లో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పదునైన దాడికి షాజహాన్-సందేష్‌ఖాలీ వివాదం కేంద్రీకృతమై ఉంది. తృణమూల్ తన మాజీ సభ్యుడిని కాపాడుతోందని మోదీ ఆరోపించారు. మహిళల బాధలపై “కొంతమంది వ్యక్తులకు” విలువ ఇస్తున్నందుకు బెంగాల్ సీఎంను నిందించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×