BigTV English
Advertisement

WhatsApp: అదే జరిగితే ఇండియా నుంచి వెళ్లిపోతాం.. వాట్సాప్ సంచలన కామెంట్స్..

WhatsApp: అదే జరిగితే ఇండియా నుంచి వెళ్లిపోతాం.. వాట్సాప్ సంచలన కామెంట్స్..

WhatsApp Sensational Comments: వాట్సాప్ సంచలన కామెంట్స్ చేసింది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను రద్దు చేయాలనుకుంటే భారత్ నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోతామని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. వినియోగదారుని గోప్యత దృశ్యా తాము ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే వాట్సాప్‌ను భారతదేశంలో నిలిపివేస్తామని మెటా కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా మెసేజ్ కంటెంట్‌ను పంపినవారు, గ్రహీత మాత్రమే చదవగలరని.. దానిని విచ్ఛిన్నం చేస్తే వినియోగదారుని గోప్యతకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నారు.


వాట్సాప్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ మెటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021ని సవాలు చేస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం కంపెనీలు చాట్‌లను ట్రేస్ చేయడం, మెసేజ్ మూలాలను గుర్తించడం అవసరం.

వాట్సాప్‌ను ప్రజలు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ అందించే గోప్యతా లక్షణాల కారణంగా, భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు వాట్సాప్‌ను వాడుతున్నారని న్యాయవాది తెలిపారు. కంటెంట్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు వినియోగదారుల గోప్యతను దెబ్బతీసే ఏవైనా నియమాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 కింద ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తాయని వాట్సాప్ వాదించింది.


Also Read: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం

కంపెనీ తరపు న్యాయవాది, “ఇలాంటి నిబంధన ప్రపంచంలో మరెక్కడా లేదు. బ్రెజిల్‌లో కూడా కాదు. దీని కోసం పెద్ద ఛైన్ సిస్టం డెవలప్ చెయ్యాలి. ఏ సందేశాలను డీక్రిప్ట్ చేయమని అడగుతారో మాకు తెలియదు. దీని అర్థం మిలియన్ల సందేశాలు కొన్ని సంవత్సరాల పాటు నిల్వ చేయాలి.” అని తెలిపారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×