E-Paper
Advertisement

WhatsApp: అదే జరిగితే ఇండియా నుంచి వెళ్లిపోతాం.. వాట్సాప్ సంచలన కామెంట్స్..

WhatsApp: అదే జరిగితే ఇండియా నుంచి వెళ్లిపోతాం.. వాట్సాప్ సంచలన కామెంట్స్..
Advertisement

WhatsApp Sensational Comments: వాట్సాప్ సంచలన కామెంట్స్ చేసింది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను రద్దు చేయాలనుకుంటే భారత్ నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోతామని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. వినియోగదారుని గోప్యత దృశ్యా తాము ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే వాట్సాప్‌ను భారతదేశంలో నిలిపివేస్తామని మెటా కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా మెసేజ్ కంటెంట్‌ను పంపినవారు, గ్రహీత మాత్రమే చదవగలరని.. దానిని విచ్ఛిన్నం చేస్తే వినియోగదారుని గోప్యతకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నారు.

వాట్సాప్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ మెటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021ని సవాలు చేస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం కంపెనీలు చాట్‌లను ట్రేస్ చేయడం, మెసేజ్ మూలాలను గుర్తించడం అవసరం.

Advertisement

వాట్సాప్‌ను ప్రజలు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ అందించే గోప్యతా లక్షణాల కారణంగా, భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు వాట్సాప్‌ను వాడుతున్నారని న్యాయవాది తెలిపారు. కంటెంట్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు వినియోగదారుల గోప్యతను దెబ్బతీసే ఏవైనా నియమాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 కింద ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తాయని వాట్సాప్ వాదించింది.

Also Read: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం

Advertisement

కంపెనీ తరపు న్యాయవాది, “ఇలాంటి నిబంధన ప్రపంచంలో మరెక్కడా లేదు. బ్రెజిల్‌లో కూడా కాదు. దీని కోసం పెద్ద ఛైన్ సిస్టం డెవలప్ చెయ్యాలి. ఏ సందేశాలను డీక్రిప్ట్ చేయమని అడగుతారో మాకు తెలియదు. దీని అర్థం మిలియన్ల సందేశాలు కొన్ని సంవత్సరాల పాటు నిల్వ చేయాలి.” అని తెలిపారు.

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×