E-Paper
Advertisement

Woman gives Birth to 5 Babies: ఒకే కాన్పులో అంతమంది శిశువులా..?

Woman gives Birth to 5 Babies: ఒకే కాన్పులో అంతమంది శిశువులా..?
Advertisement

Woman in Bihar gives Birth to 5 Babies : ఓ గర్భిణీకి పురిటినొప్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని ఆసుపత్రి వైద్యులు పరీక్షించి సురక్షితంగా ప్రసవం చేశారు. అయితే, ఆమె ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తల్లీ ఐదుగురు శిశువులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఆమెకు ఇది వరకే ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది.

బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా ఠాకూర్ గంజ్ ప్రాంతానికి చెందినటువంటి ఓ గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఠాకూర్ గంజ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని వైద్యులు పరీక్షించారు. అనంతరం సురక్షితంగా ప్రసవం చేశారు. అయితే, ఆమె ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు ఆడశిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ ఐదుగురు శిశువులు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Advertisement

అయితే, ఆమెకు ఇదివరకే ఒక కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆమె సంతానం ఆరుగురు. అయితే ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఒకే సమయంలో ఫలదీకరణం చెందడవం వల్ల ఇలా ఒకే కాన్పులో ఎక్కువమంది శిశువులకు జన్మనిస్తారని వారు తెలిపారు. అయితే, ఆమెకు ప్రసవం చేయడం తమకు సవాల్ గా మారిందని వారు తెలిపారు. అదేవిధంగా జన్యుపరమైనటువంటి కారణాల వల్ల కూడా ఇలా ఒకే కాన్పులో ఎక్కువమంది శిశువులు జన్మిస్తుంటారని తెలిపారు. కాగా, ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం స్థానికంగా చర్చనీయాంశమయ్యిందని.. ఈ విషయం తెలిసి స్థానికులు ఆసుపత్రికి చేరుకుని నవజాత శిశువులను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

Advertisement

కాగా, కొన్నాళ్ల క్రితం జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ఓ మహిళ కూడా ఇలాగే ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చింది. అది కూడా గర్భం దాల్చిన ఏడు నెలలకే ఆమె ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. దీంతో అప్పుడు స్థానికంగా భారీగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Tags

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×