BigTV English
Advertisement

Woman gives Birth to 5 Babies: ఒకే కాన్పులో అంతమంది శిశువులా..?

Woman gives Birth to 5 Babies: ఒకే కాన్పులో అంతమంది శిశువులా..?

Woman in Bihar gives Birth to 5 Babies : ఓ గర్భిణీకి పురిటినొప్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని ఆసుపత్రి వైద్యులు పరీక్షించి సురక్షితంగా ప్రసవం చేశారు. అయితే, ఆమె ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తల్లీ ఐదుగురు శిశువులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఆమెకు ఇది వరకే ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది.


బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా ఠాకూర్ గంజ్ ప్రాంతానికి చెందినటువంటి ఓ గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఠాకూర్ గంజ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని వైద్యులు పరీక్షించారు. అనంతరం సురక్షితంగా ప్రసవం చేశారు. అయితే, ఆమె ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు ఆడశిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ ఐదుగురు శిశువులు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

అయితే, ఆమెకు ఇదివరకే ఒక కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆమె సంతానం ఆరుగురు. అయితే ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఒకే సమయంలో ఫలదీకరణం చెందడవం వల్ల ఇలా ఒకే కాన్పులో ఎక్కువమంది శిశువులకు జన్మనిస్తారని వారు తెలిపారు. అయితే, ఆమెకు ప్రసవం చేయడం తమకు సవాల్ గా మారిందని వారు తెలిపారు. అదేవిధంగా జన్యుపరమైనటువంటి కారణాల వల్ల కూడా ఇలా ఒకే కాన్పులో ఎక్కువమంది శిశువులు జన్మిస్తుంటారని తెలిపారు. కాగా, ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం స్థానికంగా చర్చనీయాంశమయ్యిందని.. ఈ విషయం తెలిసి స్థానికులు ఆసుపత్రికి చేరుకుని నవజాత శిశువులను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.


Also Read: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

కాగా, కొన్నాళ్ల క్రితం జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ఓ మహిళ కూడా ఇలాగే ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చింది. అది కూడా గర్భం దాల్చిన ఏడు నెలలకే ఆమె ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. దీంతో అప్పుడు స్థానికంగా భారీగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×