OTT Movie : ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న సరికొత్త కన్నడ సినిమాలు, తొందర్లోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ సినిమాలు ఒక్కోటి ఒక్కో జానర్ లో తెరకెక్కాయి. ఈ సినిమాలన్నీ థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక మూవీ లవర్స్ కి ఈ నెల పండగ చేసుకోవడమే ఆలస్యం. ఈ కన్నడ సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
‘హెబ్బులి కట్’ (Hebbuli Cut)
ఈ కన్నడ కామెడీ మూవీకి భీమరావు దర్శకత్వం వహించారు. ఇది సతీశ్ నీనాసం నిర్మాణ సమర్పణలో సారా ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కింది. ఈ సినిమా 2025 జూలై 4 న థియేటర్లలో విడుదలైంది. ఇది 2017లో విడుదలైన కన్నడ చిత్రం ‘Hebbuli’ లో, కిచ్చా సుదీప్ ఐకానిక్ హెయిర్స్టైల్ను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఉత్తర కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇందులో నవనీత్ శామ్, దీపక్ యరగెర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలైంది. ఈ నెలలో ఓటీటీలోకి ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.
‘కపట నాటక సూత్రధారి’ (Kapata Nataka Sutradhari)
ఈ పొలిటికల్ డ్రామా మూవీకి ధీరజ్ ఎం.వి. దర్శకత్వం వహించారు. ఇందులో అభిరామ అర్జున, ధీరజ్ ఎం.వి., వరుణ్ గురురాజ్, శ్రీ సాగర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రాజకీయ,మతపరమైన అంశాలతో తెరకెక్కింది. 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2025 జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్ ఫామ్లలో ఈ సినిమా త్వరలో అందుబాటులోకి రానుంది.
‘జంగల్ మంగళ్’ (Jungle Mangal)
ఈ కన్నడ లైట్-హార్టెడ్ థ్రిల్లర్ మూవీకి రక్షిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో యశ్ శెట్టి, హర్షిత రామచంద్ర, ఉగ్రం మంజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 జూలై 4న కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇది కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మల్నాడ్, కరావళి ప్రాంతాల సంస్కృతి నేపథ్యంలో, ఒక లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను 750,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 1 గంట 32 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.8/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా, ఈ నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
‘పెన్ డ్రైవ్’ (Pen Drive)
ఈ కన్నడ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ డేవిడ్ దర్శకత్వం వహించారు. ఇందులో మాళశ్రీ, తనీషా కుప్పండ, సంజనా నాయుడు, కరి సుబ్బు, బిగ్ బాస్ ఫేమ్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2025 జూలై 4 న కర్ణాటకలోని థియేటర్లలో విడుదలైంది. RH ఎంటర్ప్రైజెస్, శ్రీ తిరుమల సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై N హనుమంతరాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా స్టోరీ ఒక పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది.
Read Also : దెయ్యంతో పెళ్లి డీల్… ఫ్యామిలీలో వరుస హత్యలు… కలలో కూడా ఊహించని డేంజరస్ హర్రర్ స్టోరీ