E-Paper
Advertisement

OTT Movie : పొరుగింటి వాడితో భార్య… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే భర్త… చక్కిలిగింతలు పెట్టే మలయాళ ఫ్యామిలీ డ్రామా

OTT Movie : పొరుగింటి వాడితో భార్య… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే భర్త… చక్కిలిగింతలు పెట్టే మలయాళ ఫ్యామిలీ డ్రామా
Advertisement

OTT Movie : కామెడీ థ్రిల్లర్‌ జానర్ లో తెరకెక్కిన ఒక మలయాళం సినిమా రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఒక సైన్టిస్ట్ తన భార్య మీద అనుమానంతో, అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో సైన్టిస్ట్ ఎదుర్కునే సంఘటనలు హాస్యాస్పదంగా మారుతాయి. ఈ సినిమా చివరివరకు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే

రవీంద్రన్ ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ శాస్త్రవేత్త. తన జీవితాన్ని కచ్చితమైన నియమాలతో నడుపుతుంటాడు. అతను తన భార్య బిందు, కుమార్తెతో కొచ్చిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సంతోషంగా జీవిస్తుంటాడు. అయితే ఒక రోజు పొరుగింటి జాన్ గురించి రవీంద్రన్ కి ఒక వింత సమస్య వస్తుంది. రవీంద్రన్ పనికి వెళ్లినప్పుడు జాన్ తరచూ ఇంటికి వస్తున్నాడని తెలుస్తుంది. రవీంద్రన్ కి బిందుపై అనుమానం కలుగుతుంది. ఈ అనుమానం రవీంద్రన్‌ను పిచ్చివాడిలా మారుస్తుంది. అతను బిందు గురించి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఒక వింత సంఘటన జరుగుతుంది. రవీంద్రన్ ఒక కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటాడు. రవీంద్రన్ అతి ఆలోచనలు, పొరపాట్లు ఒక పోలీస్ కేసుగా మారి, అతన్ని ఒక అయోమయంలో పడేస్తాయి.

Advertisement

ఈ గందరగోళంలో, రవీంద్రన్ తన అనుమానాలను పరిష్కరించడానికి, కిడ్నాప్ కేసు నుండి తప్పించుకోవడానికి ఒక కామెడీ ఎస్కేప్ ప్లాన్‌ను రెడీ చేసుకుంటాడు. క్లైమాక్స్‌లో రవీంద్రన్, జాన్ గురించి ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు. ఇది ఈ స్టోరీ ముగింపుకి దారి తీస్తుంది. చివరికి రవీంద్రన్ భార్యతో జాన్ ఎందుకు సీక్రెట్ గా కలుస్తుంటాడు ? అసలు ఈ కిడ్నాప్ స్టోరీ ఏమిటి ? క్లైమాక్స్ ట్విస్ట్‌ ఏమిటి ? రవీంద్రన్ వీటి నుంచి ఎలా బయట పడతాడు ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

సైనా ప్లేలో స్ట్రీమింగ్

‘Raveendra Nee Evide?’ (రవీంద్ర, నీవు ఎక్కడ?) 2025లో విడుదలైన మలయాళ కామెడీ థ్రిల్లర్ చిత్రం. మనోజ్ పలోడన్ దర్శకత్వంలో, కృష్ణ పూజప్పుర రచనతో, అనూప్ మీనన్ (రవీంద్రన్), షీలు అబ్రహం (బిందు), ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 1989 న వడక్కునోక్కియంత్రం నుండి ప్రేరణ పొందింది. 2025 జూలై 18న థియేటర్లలో విడుదలై, 1 గంట 43 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 4.8/10 రేటింగ్ పొందింది. 2025 సెప్టెంబర్ 3 నుంచి సైనా ప్లేలో మలయాళం ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Advertisement

Read Also : అమ్మాయి ప్రైవేట్ వీడియో రికార్డు చేసి, చేయకూడని పని… ఈ క్రైమ్ థ్రిల్లర్లో ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×