BigTV English

OTT Movie : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే

OTT Movie : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు సరికొత్త స్టోరీలతో సత్తా చాటుతున్నాయి. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక వెబ్ సిరీస్ IMDbలో 9 రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఉత్కంఠభరతంగా సాగే ఒక స్పై స్టోరీ. భారతదేశ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW), పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మధ్య జరిగే ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

1966లో భారత అణు శాస్త్రవేత్త హోమి జహాంగీర్ భాభా విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ స్టోరీ ప్రారంభమవుతుంది. ఇది విదేశీ గూఢచార సంస్థల (CIA) కుట్రగా అనుమానిస్తారు. ఈ సంఘటన భారత అణు కార్యక్రమానికి ఎదురుదెబ్బగా మారుతుంది. దీని తర్వాత R&AW స్థాపించబడుతుంది. విష్ణు శంకర్ ఒక R&AW గూఢచారి. హోమి భాభా మరణంలో తన వైఫల్యం గురించి అపరాధ భావనతో ఉంటాడు. మరోవైపు 1971లో ఇండో-పాక్ యుద్ధం తర్వాత, పాకిస్తాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంటుంది. దీనిని భారతదేశం నిరోధించాలని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో
విష్ణు అండర్ కవర్‌లో ఇస్లామాబాద్‌కు వెళ్తాడు. అతని లక్ష్యం పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం. అతను ముర్తజా మాలిక్ అనే ISI చీఫ్‌తో మైండ్ గేమ్ లో బిజీ అవుతాడు.


Read Also : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

సుఖ్‌బీర్ అనే ఒక భారతీయ గూఢచారి, కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రఫీక్ అనే మారుపేరుతో బ్రోకర్‌గా పనిచేస్తాడు. అతను విష్ణు బృందంలో కీలక సభ్యుడు. కానీ తన గుర్తింపు ఎక్కడ బయటపడుతుందో అని నిరంతరం భయపడుతుంటాడు. అతను తన కుటుంబ జీవితాన్ని కోరుకుంటాడు. కానీ దేశం కోసం తనను తాను త్యాగం చేయాల్సిన సందర్భం ఎదురవుతుంది. పాకిస్తాన్ ఫ్రాన్స్ నుండి ఒక అణు రియాక్టర్‌ను రహస్యంగా కొనుగోలు చేస్తుందని తెలుసుకున్న విష్ణు బృందం, గదానీ పోర్ట్ వద్ద దానిని నాశనం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రణాళికలో సుఖ్‌బీర్ కీలక పాత్ర పోషిస్తాడు. తన జీవితాన్ని బలిదానం చేస్తూ ఒక పేలుడు పదార్థాలతో నిండిన బోట్‌ను రియాక్టర్ షిప్‌పైకి ఢీకొట్టి, మిషన్‌ను విజయవంతం చేస్తాడు.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘సారే జహాన్ సే అచ్ఛా: ది సైలెంట్ గార్డియన్స్’ అనేది ఒక బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్. సుమిత్ పురోహిత్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రతీక్ గాంధీ , సన్నీ హిందుజా, సుహైల్ నయ్యర్, కృతికా కామ్రా, తిలోత్తమా షోమ్, రాజత్ కపూర్, అనుప్ సోనీ, హేమంత్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్ 2025 ఆగస్టు 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, IMDbలో 9.0/10 రేటింగ్ ను పొందింది.

Related News

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల పాపపై అఘాయిత్యం… బ్లడ్ బాయిలయ్యే మలయాళ క్రైమ్ డ్రామా

OTT Movie : కన్న కూతురిని జూదానికి బలిచ్చే తండ్రి… మొత్తం అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : చావుకు దగ్గరైన వాళ్ళను సింథటిక్ బొమ్మలుగా… ఏలియన్ ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్… భవిష్యత్తు అంటేనే భయపెట్టే సై-ఫై సిరీస్

OTT Movie : ప్రియురాలిని పరాయి మగాళ్లకు పణంగా… 16 ఏళ్ల వయసులో రాకూడని కష్టం… కిరాక్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×