OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు సరికొత్త స్టోరీలతో సత్తా చాటుతున్నాయి. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక వెబ్ సిరీస్ IMDbలో 9 రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఉత్కంఠభరతంగా సాగే ఒక స్పై స్టోరీ. భారతదేశ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW), పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మధ్య జరిగే ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
1966లో భారత అణు శాస్త్రవేత్త హోమి జహాంగీర్ భాభా విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ స్టోరీ ప్రారంభమవుతుంది. ఇది విదేశీ గూఢచార సంస్థల (CIA) కుట్రగా అనుమానిస్తారు. ఈ సంఘటన భారత అణు కార్యక్రమానికి ఎదురుదెబ్బగా మారుతుంది. దీని తర్వాత R&AW స్థాపించబడుతుంది. విష్ణు శంకర్ ఒక R&AW గూఢచారి. హోమి భాభా మరణంలో తన వైఫల్యం గురించి అపరాధ భావనతో ఉంటాడు. మరోవైపు 1971లో ఇండో-పాక్ యుద్ధం తర్వాత, పాకిస్తాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంటుంది. దీనిని భారతదేశం నిరోధించాలని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో
విష్ణు అండర్ కవర్లో ఇస్లామాబాద్కు వెళ్తాడు. అతని లక్ష్యం పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం. అతను ముర్తజా మాలిక్ అనే ISI చీఫ్తో మైండ్ గేమ్ లో బిజీ అవుతాడు.
Read Also : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్
‘సారే జహాన్ సే అచ్ఛా: ది సైలెంట్ గార్డియన్స్’ అనేది ఒక బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్. సుమిత్ పురోహిత్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రతీక్ గాంధీ , సన్నీ హిందుజా, సుహైల్ నయ్యర్, కృతికా కామ్రా, తిలోత్తమా షోమ్, రాజత్ కపూర్, అనుప్ సోనీ, హేమంత్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరు ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ 2025 ఆగస్టు 13న నెట్ఫ్లిక్స్లో విడుదలై, IMDbలో 9.0/10 రేటింగ్ ను పొందింది.