E-Paper
Advertisement

కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే.. ఇక్కడ అడ్డంకులు ఎందుకు: ఎన్వీ సుభాష్!

కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే.. ఇక్కడ అడ్డంకులు ఎందుకు: ఎన్వీ సుభాష్!
Advertisement

Modi Visit: స్వేచ్ఛ బ్యూరో: ఈనెల 10వ తేదీన తెలంగాణకు ప్రధాని మోడీ రావడం అభివృద్ధికి పండుగ లాంటిదని బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన వస్తున్నారంటే రూ.వేల కోట్ల అభివృద్ధిని మూటగట్టుకొని వస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో దాదాపు రూ. 7,823 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారని సుభాష్ తెలిపారు. ఇది తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపే మరో పెద్ద స్టెప్ అని కొనియాడారు. మోడీ రాకతో వరంగల్ నేతన్నలకు గ్లోబల్ గుర్తింపు దక్కనుందని వెల్లడించారు. నాడు కాకతీయుల కళా వైభవానికి నిలయమైన వరంగల్ గడ్డ, ఇప్పుడు టెక్స్‌టైల్ పవర్‌హౌస్‌గా మారబోతోందన్నారు. రూ.1,695 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ‘పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తున్నారన్నారు.

బీబీనగర్ ఎయిమ్స్ రూపంలో..

ఇకపోతే బీబీనగర్ ఎయిమ్స్.. పేదలకు కొండంత అండగా నిలుస్తోందన్నారు. పైసలు లేక వైద్యం అందడం లేదని ఏ పేదవాడు రంది పడొద్దన్నదే మోదీ సంకల్పమని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ రూపంలో రూ.2,000 కోట్లతో ఒక అద్భుతమైన దవాఖానాను కేంద్రం నిర్మించిందని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో రూ.వేలకు వేలు గుంజే టెస్టులు ఇక్కడ రూ.వందల్లోనే పూర్తవుతాయన్నారు. కేవలం పది రూపాయలకే పెద్ద డాక్టర్లు వైద్యం అందించే సదుపాయం కూడా ఉందన్నారు. ఇది పేద ప్రజల ప్రాణం నిలబెట్టే దేవాలయం లాంటిదన్నారు. వీటితో పాటు తెలంగాణ నలుమూలలా అభివృద్ధి జరగనుందని సుభాష్ వెల్లడించారు. నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో తెలంగాణ రైల్వేలకు వేలకోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కాజీపేట-విజయవాడ లైన్లు, కొత్త స్టేషన్లతో కనెక్టివిటీ పెరుగుతోందన్నారు.

Advertisement

Also read: గద్వాల్లో బెల్ట్ షాపుల జోరు యువత బేజారు.. పట్టించుకోని అధికారులు

జహీరాబాద్ స్మార్ట్ సిటీతో ..

మహబూబ్‌నగర్ జాతీయ రహదారి పనులు, మల్కాపూర్ పెట్రోలియం టర్మినల్, సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ.. ఇలా ఏ రంగం చూసినా కేంద్రం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జహీరాబాద్ స్మార్ట్ సిటీతో మరో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే, ఇక్కడి కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన సూచించారు. డీలిమిటేషన్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసని, అభివృద్ధి ఎక్కడ ఉంటే మద్దతు అక్కడే ఉంటుందని రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఓటు శాతమే సాక్ష్యమని సుభాష్ పేర్కొన్నారు.

Advertisement

Also read: ఇకనైనా కళ్లు తెరవండి బాబూ.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రికార్డులు బ్రేక్..!

Related News

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

Big Stories

Advertisement
×