Budget Recharge: మొబైల్ రీఛార్జ్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో సామాన్య వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 200 లోపు లభించే ప్లాన్లు వారికి ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వీఐ అందిస్తున్న రూ.200లోపు బెస్ట్ ప్లాన్లు, వాటి బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.
రూ.200 లోపు బడ్జెట్ లో జియో తీసుకొచ్చిన బెస్ట్ ప్లాన్లలో ఇదీ ఒకటి. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో మొత్తం 2 GB డేటా (ప్లాన్ కాలానికి), అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్కు ఉచిత యాక్సెస్ పొందొచ్చు. ఒకవేళ 2GB డేటా పరిమితి అయిపోతే.. 64 kbps స్పీడ్ తో అపరిమితంగా నెట్ వాడుకోవచ్చు.
ఎయిర్ టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులోనూ 2 GB హై స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు మెుత్తం 300 ఎస్ఎంఎస్ల ఫ్రీగా చేసుకోవచ్చు. కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, సిమ్ యాక్టివ్గా ఉంచుకోవడానికి ఈ ప్లాన్ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. డేటా లిమిట్ అయిపోతే ప్రతీ 1MB డేటాకు 50 పైసలు ఖర్చు కానుంది.
Also Read: పెంపుడు కుక్కలు, మనుషులే టార్గెట్.. వెలుగులోకి భయంకరమైన ఫాక్స్ టేప్వార్మ్!
వోడాఫోన్ ఇండియా ఈ ప్లాన్ ను జియో, ఎయిర్ టెల్ తరహా బెనిఫిట్స్ తోనే తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వారికి 28 వ్యాలిడిటీ లభించనుంది. అలాగే 2GB డేటా, ఫ్రీ కాల్స్, 300 వరకూ ఎస్ఎంఎస్ లు వినియోగదారులు చేసుకోవచ్చు. అంతేకాకుండా వీఐ మూవీస్ అండ్ టీవీ కంటెంట్ ను ఉచితంగా వీక్షించే వెసులుబాటును ఈ ప్లాన్ కల్పిస్తోంది.
Also Read: Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..