Jio Prime Membership: మన దేశంలో అత్యధికంగా వాడే టెలికాం నెట్వర్క్ జియో తమ వినియోగదారుల కోసం ఒక గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. గతంలో ఎంతో ఆదరణ పొందిన Jio Prime సభ్యత్వాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. రూ.300తో ఈ ప్లాన్ తీసుకుంటే ఏడాది పాటు రీఛార్జ్ ధరల భయం ఉండదు. అంతేకాదు.. క్యాష్బ్యాక్లు, ప్రత్యేక సేవలు కూడా లభిస్తాయి.
మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు తరచూ పెరుగుతుంటాయనే భయం చాలామందిలో ఉంటుంది. కానీ జియో ప్రైమ్ తీసుకుంటే ఏడాది పాటు మీ ప్లాన్ ధర మారకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచినా.. ప్రైమ్ సభ్యులకు పాత ధరలే వర్తిస్తాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఒకే రేటుతో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
Also Read: iPhone 18 Pro రాకముందే షాకింగ్ ఆఫర్.. రూ.22,000 తగ్గిన iPhone 17 Pro ధర!
ఈ ఆఫర్తో కేవలం రీఛార్జ్ ధరల రక్షణ మాత్రమే కాదు.. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొత్తగా జియో హోమ్ లేదా జియో పీసీ కనెక్షన్ తీసుకునే వారికి రూ.300 క్యాష్బ్యాక్ వోచర్ లభిస్తుంది. అలాగే మీ ద్వారా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కొత్త జియో సిమ్ తీసుకుంటే మరొక రూ.300 వోచర్ వస్తుంది. ఇలా మొత్తం రూ.600 వరకు ఆదా చేసుకోవచ్చు.
సాధారణంగా ఏమైనా సమస్యలు వస్తే కస్టమర్ కేర్ను సంప్రదించడానికి సమయం పడుతుంది. కానీ ప్రైమ్ సభ్యులకు ఆ తిప్పలు ఉండవు. వారికి నేరుగా ప్రాధాన్యత ఇస్తూ వేగంగా సేవలు అందిస్తారు. దీంతో కస్టమర్ కేర్ లైన్లలో ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం అసలే ఉండదు.
జియో సంస్థ భవిష్యత్తులో మార్కెట్లోకి తీసుకురాబోయే కొత్త సేవలు లేదా డివైజ్లను అందరికంటే ముందే ప్రైమ్ సభ్యులు వినియోగించుకోవచ్చు. కొత్త ఉత్పత్తుల ట్రయల్స్ కూడా మొదట్లోనే వస్తాయి. రోజువారీ మొబైల్ వాడకందారులకు, ముఖ్యంగా ధరల పెంపు నుంచి ఉపశమనం కోరుకునే వారికి ఈ రూ.300 ఆఫర్ నిజంగా మంచి ప్రయోజనకరమైన ఎంపిక.
Also Read: ఫ్లిప్కార్ట్లో ఊహించని ఆఫర్.. Oppo Find X9పై ఏకంగా రూ. 22,220 డిస్కౌంట్!