IND VS PAK: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Vs Pakistan) మధ్య మళ్లీ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కనీసం రెండు మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పహల్గాం సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే బ్యాన్ చేసింది బిసిసిఐ (BCCI). దీంతో దాదాపు రెండు సంవత్సరాలుగా.. ఎక్కడ మ్యాచ్ జరిగినా షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. దీనిపై పాకిస్తాన్ అనేక విమర్శలు చేస్తూ… అంతర్జాతీయంగా ఇండియాను దోషిగా చూపించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మనోళ్లు తగ్గలేదు. పాకిస్తాన్ ఒక ఈకతో సమానం అన్నట్లుగా వ్యవహరించారు.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Asian Games tournament) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆసియా క్రీడాలు జరుగుతున్న నేపథ్యంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్న లక్ష్యంతో రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయట. షేక్ హ్యాండ్ వివాదంలో (IND VS PAK handshake ) బీసీసీఐ (BCCI) కాస్త తగ్గాలని ఇప్పటికే ఐసీసీ చైర్మన్ జై షాను ( ICC Jay Shah) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) పెద్దలు కూడా కలిశారట.
షేక్ హ్యాండ్ ఇస్తే.. క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని.. అలాగే రెండు దేశాలకు గౌరవం ఉంటుందని ఓ నివేదిక కూడా ఇచ్చారట. అయితే దీనికి ఐసీసీ బాస్ జై షా పెద్ద మనసు చేసుకొని… షేక్ హ్యాండ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బిసిసిఐ ఒప్పుకోకపోయినా… బలవంతం చేసి మరి, షేక్ అండ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారట జై షా. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ (BCCI) కూడా దిగి వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏషియన్ గేమ్స్ లో భాగంగా మ్యాచులు జరిగితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చినందుకుగాను ఐసీసీ బాస్ జై షా పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఇండియాను అవమానించేలా జై షా వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఐసీసీ పదవిలో ఉండి… ఇండియాకు అన్యాయం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. మహాల్గంలో అంతమంది భారతీయులను చంపిన పాకిస్తాన్ వెధవలతో షేక్ హ్యాండ్ ఇవ్వడం అవసరమా ? అంటూ నిలదీస్తున్నారు.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్