Abhishek Sharma Fifty Cancel: ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs. Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) జరుగుతోంది. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ షురూ అయింది. అయితే ఇందులో శుక్రవారం సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్, బెల్ఫాస్ట్ వేదికగా ( Civil Service Cricket Club, Belfast) జరిగిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచి ఓటమి పాలైంది. దీంతో టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోతారా? కొంచమైనా సిగ్గుందా? అంటూ ఫైర్ అవుతున్నారు. టి20 ఛాంపియన్ అయి ఉండి, అనామక జట్టు చేతిలో ఓడిపోతే పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
ఐర్లాండ్ చేతిలో టీమిండియా (Ireland vs. Team India) ఓడిపోయిన బాధలో అభిమానులు ఉంటే, డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్ పైన 19 బంతుల్లోనే అర్థ సెంచరీ (Abhishek Sharma Fifty) చేసిన అభిషేక్ శర్మకు, అంపైర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఐర్లాండ్ పై శుక్రవారం చేసిన అర్థ సెంచరీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభిషేక్ శర్మ ఖాతాలో ఈ అర్థ సెంచరీ (Abhishek Sharma Fifty Cancel) అధికారికంగా రికార్డు కాలేదు. 19 బంతుల్లో 50 పరుగులు చేసినట్లుగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్రాడ్ కాస్టర్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతర ఫ్లాట్ ఫామ్స్ లలో కూడా అభిషేక్ శర్మ (Abhishek Sharma ) అర్థ సెంచరీ చేసినట్లు పేర్కొన్నారు. బీసీసీఐ ( BCCI), క్రిక్ బజ్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత, అర్థ సెంచరీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 బంతులు ఆడిన అభిషేక్ శర్మ, 49 పరుగులు చేసినట్లుగా కౌంట్ ఫైనల్ చేశారు. రెండవ ఓవర్ లో అభిషేక్ శర్మ తీసిన సింగిల్ లెగ్ బై గా ప్రకటించడమే, ఎందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఎనిమిదవ ఓవర్ లో అవుట్ అయ్యేవరకు అది సింగిల్ గానే కౌంట్ చేశారు. కానీ చివరికి ఆ సింగిల్ తొలగించడంతో… అభిషేక్ శర్మ అర్థ సెంచరీ రద్దయింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఇదే తొలిసారి అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ రద్దు కావడంపై అతని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అంపైర్లు, నిర్వాహకులు నిద్రపోతున్నారా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదే విషయం ముందే చెబితే, అభిషేక్ శర్మ ఔట్ అయ్యే వాడు కాదంటున్నారు.