E-Paper
Advertisement

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్
Advertisement

 Ind vs Pak :  ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెంచేందుకు సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోను రూపొందించింది. దీనికి హైప్ తీసుకొచ్చేందుకు  రకరకాల ప్రయత్నాలు చేస్తోంది సోనీ స్పోర్ట్స్. దీంతో సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియో ను రూపొందించడం పై సోషల్ మీడియా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ కి సంబంధించి సోనీ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో వీడియో ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసిందనే చెప్పాలి. ఇటీవలే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Also Read : Virat Kohli : AB డివిలియర్స్ తల్లిని పచ్చి బూతులు తిట్టిన కోహ్లీ… ఇదిగో షాకింగ్ వీడియో

Advertisement

సోనీ స్పోర్ట్స్ పై మండిపడుతున్న అభిమానులు 

అయితే ప్రస్తుతం అదే పాకిస్తాన్ తో మ్యాచ్ కి ప్రోమో చేసినందుకు సోనీ స్పోర్ట్స్ పై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అవసరమైతే ఆసియా కప్, సోనీ స్పోర్ట్స్ ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో #BoycottAsiaCup, #ShameOnSonySports అనే హ్యాష్ ట్యాగ్స్  ట్రెండ్ అవుతున్నాయి. బాధితుల కుటుంబాలను అవమానపరిచే విధంగా వీడియో ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మరోవైపు ఈ ప్రకటనలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కనిపించడంతో అతనిపై సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. “మనదే విజయం” అని సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురి చేసాయి. ఈప్రచారంలో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ “మేము వరల్డ్ ఛాంపియన్లం. టీ-20, ఛాంపియన్స్ ట్రోఫీ మనదే. ఆసియా కప్ కూడా మనదే అవుతుంది ” అని పేర్కొన్నారు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ ని కూడా సెహ్వాగ్ పొగడ్తలతో ముంచెత్తారు.

Advertisement

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అద్భుతం.. 

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అద్భుతం అనే చెప్పవచ్చని.. అతని కెప్టెన్సీలో జట్టు చాలా ఉంది. ఇక మనం గెలవడం ఖాయం అని స్పష్టం చేశారు. ఈ సారి ఆసియా కప్ కోసం భారత్ గ్రూపు ఏ లో పోటీ పడుతుంది. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ వంటి దేశాలతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 10 యూఏఈతో తొలి మ్యాచ్ లో తలపడనుంది భారత్. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో భారీ పోరు ఉండనుంది. ఇక సెప్టెంబర్ 19న ఒమన్ తో గ్రూప్ దశ మ్యాచ్ ముగుస్తుంది. గ్రూపు దశ మ్యాచ్ లు ముగిసిన తరువాత టాప్ 4 నిలిచిన జట్లు తలపడుతాయి. ఆ తరువాత సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ తో ఆసియా కప్ ముగుస్తుంది. ఈ టోర్నీలో గ్రూపు ఏలో ఉన్న పాకిస్తాన్, భారత్ రెండు జట్లు ఫైనల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకూడదని కొందరూ టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. ఆసియా కప్ ని బాయ్ కాట్ చేయాలని సూచిస్తున్నారు.

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×