Akash Ambani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Chennai Super Kings) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ ( Akash Ambani ) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ముంబై ప్లేయర్ల వికెట్లు వరుసగా పడుతున్న నేపథ్యంలో స్టేడియం వదిలి ఇంటికి వెళ్లిపోయాడు. పోతూ పోతూ ముంబై ఇండియన్స్ అభిమానులను కూడా వెళ్లిపోండి అంటూ సిగ్నల్స్ ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ముంబై ఇండియన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై ఆకాష్ అంబానీ అసహనంతో ఉన్నాడని.. అతని చేసిన తప్పిదాల వల్ల మ్యాచ్ మధ్యలో వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 33వ మ్యాచ్ జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 103 పరుగుల తేడాతో విక్టరీ అందుతుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఒక్కడుంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ పరువు గంగలో కలిసింది. సూర్య కుమార్ యాదవ్ 37 పరుగులు చేయగా తిలక్ వర్మ 37 పరుగులతో రాణించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు కూడా టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఆకాష్ అంబానీ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్ళాడు.
తాను రెగ్యులర్ గా కూర్చునే సోఫాలో నుంచి లేచిన ఆకాష్ అంబానీ… మెల్లిగా జారుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. అయితే వాళ్లను చూస్తూ… మీరు కూడా ఇంటికి వెళ్లిపోండి… మ్యాచ్ మటాష్ అయిపోయింది అన్నట్లుగా సిగ్నల్స్ ఇచ్చారు ఆకాష్ అంబానీ. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ముంబై ఇండియన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా చేస్తున్న చెత్త కెప్టెన్సీ కారణంగా ఆకాష్ అంబానీ మధ్యలోనే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలపొందని సెటైర్లు పేల్చుతున్నారు. గతంలో ఎన్నడు ఇలా మ్యాచ్ మధ్యలో ఆకాష్, నీతా ఎవరు వెళ్లలేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతులో ఓడిపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆకాష్ అంబానీ, అవమానం తట్టుకోలేక వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Akash Ambani walked off in the middle of MI's innings yesterday and asked the crowd to leave too after seeing Suryakumar Yadav and Tilak Varma's Tuk-tuk batting 😳 pic.twitter.com/pQFsBCWRSD
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) April 24, 2026