Aqib Javed: పాకిస్తాన్ క్రికెట్ (Pakistan cricket) పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారయింది. ముఖ్యంగా ఇండియాతో ఏ మ్యాచ్ జరిగిన ఓడిపోతూ అవమానాలను ఎదుర్కొంటోంది పాకిస్తాన్. మొన్న పురుషుల వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా (Pakistan vs. Team India) జట్ల మధ్య మ్యాచ్ ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగింది. ఇందులో అత్యంత దారుణంగా విఫలమైన పాకిస్తాన్ మహిళల జట్టు.. చిత్తుగా ఓడిపోయింది. ఇలా వరుసగా పురుషులు, మహిళల పాకిస్తాన్ జట్లు ఓడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై కోచ్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్ర దండం వేసి పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే మార్చలేం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆకిబ్ జావేద్ (Aqib Javed). ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ను మెరుగుపరచడం కష్టమే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
గత ఏడాది కాలంగా పాకిస్తాన్ పురుషుల జట్టు, అటు మహిళల క్రికెటర్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా చేతిలో ఓడిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టును మెరుగుపరచాలని, అక్కడి క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా పాకిస్తాన్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రదండం వేసి రాత్రికి రాత్రే పాకిస్తాన్ క్రికెట్ జట్టును బాగు చేయవచ్చని జనాలందరూ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
కానీ ఇది జన్మలో జరగదని బాంబు పేల్చారు. ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి, పతనాస్థితిలో ఉందని వెల్లడించారు. ఇలాంటి క్రమంలో మంత్రదండాలు కాదు… అల్లా దిగివచ్చిన కూడా ఏం చేయలేడని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ లో కేవలం ఆటగాళ్లను… కెప్టెన్లను మార్చడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థలోనే లోతుగా మార్పులు చేయాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త కోచ్ లుగా, సెలక్టర్లుగా ఎవరు వచ్చినా కూడా, పాకిస్తాన్ జట్టును గాడిన పెట్టడం ఉన్న ఫలంగా కాదన్నారు. దీనికి చాలా టైం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. అందరూ ఓపిక పట్టాలని కోరారు. దీంతో ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.