E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అవి 24 క్యారెట్ల‌ ప్లాట్ ట్రాక్‌ లు కాదురా నాయ‌నా.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడండి

అవి 24 క్యారెట్ల‌ ప్లాట్ ట్రాక్‌ లు కాదురా నాయ‌నా.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడండి
Advertisement

Ashwin:  ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడి… వైట్ వాష్ అయింది. ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs India) మధ్య టి20 సిరీస్ నిన్నటితో ముగిసింది. ఈ సిరీస్ నేపథ్యంలో ఆడిన రెండింటిలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే టీమిండియా ప్రదర్శన పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా స్పందించారు. టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడే ఫ్లాట్ ట్రాక్స్ కు అలవాటు పడిపోయారని.. అందుకే విదేశీ మైదానాలలో చెత్తగా ప్రదర్శన కనబరుస్తున్నారని మండిపడ్డారు. విదేశీ మైదానాలు 24 క్యారెట్ల ఫ్లాట్ ట్రాకులు (24-carat’ flat wickets) కాదని గుర్తు పెట్టుకోవాలని టీమ్ ఇండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఫ్లాట్ ట్రాక్స్ పైన ఆడటం మానేసి, విదేశీ పిచ్ లకు అలవాటు పడాలని సూచనలు చేశారు. అప్పుడే టీమిండియా ఎలాంటి కండిషన్స్ లో అయినా విజయం సాధిస్తుందని వెల్లడించారు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Ambati Rayudu react on pakistan women team : నెద‌ర్లాండ్ పై గెలిచారు క‌దా..ఇక పాక్ వీధుల్లో ర్యాలీలు చేయండి

అవి 24 క్యారెట్ల‌ ప్లాట్ ట్రాక్‌ లు కాదు.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడండి

Advertisement

ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టి20 సిరీస్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా… వైట్ వాష్ అయింది. పెద్ద జట్టు చేతిలో వైట్ వాష్ అయితే పెద్దగా పట్టించుకునేవారు కాదు.. అనామక ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో టీమిండియాను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియన్ మైదానాలలో మాత్రమే ప్లేయర్లు ఆడుతారని పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా దారుణంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. అయితే ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్ ఆడి.. ప్లేయర్ లందరూ ఫ్లాట్ ట్రాక్లకు ( Flat Tracks ) అలవాటు అయ్యారని మండిపడ్డారు. ఒళ్ళు కదలకుండా సిక్సర్లు కొట్టడం నేర్చుకున్నారని చురకలు అంటించారు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ మైదానాలలో టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ఆడలేక పోయారని విమర్శలు చేశారు. ఐర్లాండ్ మైదానాలలో బంతులు భయంకరంగా వస్తాయని… ముఖ్యంగా బౌన్సర్లు బ్యాటర్లను వనికిస్తున్నాయని గుర్తు చేశారు. ఇక ఆ బంతులకు టీమిండియా ( Team India) ప్లేయర్లు భయపడి.. వికెట్లు సమర్పించుకుంటున్నారని అశ్విన్ విమర్శలు చేశారు. ఇలా అయితే టీమిండియా మరింత దిగజారడం ఖాయమంటూ ఫైర్ అయ్యారు. ఐపీఎల్ మైదానాలే కాదు… విదేశీ ట్రాక్ల పైన ఆడటం నేర్చుకోవాలని చురకలు అంటించారు. వైభ‌వ్ సూర్య‌వంశీని రెండో మ్యాచ్ లోనూ ఆడించి ఉంటే, బాగుండ‌ని అశ్విన్ అభిప్రాయ ప‌డ్డారు.

Advertisement

Also Read:  Womens Champions Trophy 2027 No Chance For Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

 

Related News

ఇక‌నైనా బుడ్డోడిని ఆడించు, లేక‌పోతే గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్

ఐపీఎల్ పిచ్ ల‌కు అల‌వాటైపోయారు..బౌన్స‌ర్లు వ‌స్తే వ‌ణికిపోతున్నారు

ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

Ms Dhoni: ఓయ్‌ బిహారీ అంటూ యువ‌రాజ్ న‌న్ను అవ‌మానించాడు!

Ambati Rayudu: నెద‌ర్లాండ్ పై గెలిచారు క‌దా..ఇక పాక్ వీధుల్లో ర్యాలీలు చేయండి

చివ‌రి మ్యాచ్ గెలిపించినందుకు రియాజ్ జీతం పెంచాల్సిందే..నౌమన్ సెటైర్లు

Big Stories

×