BigTV English
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్ టీంలో ఫిక్సింగ్ కలకలం.. ఆ క్రికెటర్‌పై 5 ఏళ్ళు నిషేధం

Bangladesh: బంగ్లాదేశ్ టీంలో ఫిక్సింగ్ కలకలం.. ఆ క్రికెటర్‌పై 5 ఏళ్ళు నిషేధం

Bangladesh: ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడితే వారిపై నిషేధం విధించడం మీరు చూసే ఉంటారు. ఇన్నాళ్లు పురుష క్రికెటర్లకే పరిమితమైన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జాడ్యం.. ఇప్పుడు మహిళా క్రికెట్ కి అంటుకుంది. బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ షోహేలి అక్తర్ {34} పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ {ఐసీసీ} ఐదేళ్ల నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి ఆమె ఐదేళ్లపాటు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది.


Also Read: Champions Trophy 2025: సిరాజ్ ను తొక్కేసిన గంభీర్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే టీమ్ ఇండియా ఫైనల్ జట్టు ఇదే ?

ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ కింద చర్యలు తీసుకున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తొలి మహిళ క్రికెటర్ గా షోహేలి అక్తర్ నిలిచింది. 2023లో జరిగిన మహిళల టీ-20 ప్రపంచ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆమె ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించింది.


నిజానికి 2022లోనే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఆమె.. ఆ వరల్డ్ కప్ లో లేకపోయినా టోర్నీ ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్ ని సంప్రదించి ఫిక్స్ చేయాల్సిందిగా కోరింది. తాను చెప్పినట్లుగా ఆ బంగ్లాదేశ్ క్రికెటర్ హిట్ వికెట్ అయితే.. రెండు మిలియన్ల టాకాలు {బంగ్లాదేశ్ కరెన్సీ} ఇస్తానని ఆశ చూపింది. కానీ సదరు బంగ్లా క్రికెటర్.. షోహేలి ప్రతిపాదనను తిరస్కరించడంతోపాటు వెంటనే ఈ విషయాన్ని ఐసిసి అవినీతి నిరోధక విభాగం {ఐసీయూ} దృష్టికి తీసుకువెళ్లింది.

దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన ఏసీయూ.. షోహెలి మ్యాచ్ ఫిక్సింగ్ కి ప్రయత్నించినట్లు తేల్చింది. ఐసీసీ లోని ఐదు ఆర్టికల్స్ ని ఆమె అతిక్రమించిందని.. దీంతో నిషేధాన్ని విధించామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా – బంగ్లాదేశ్ మ్యాచ్ కి ముందు రోజు ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సదరు క్రికెటర్ ని సంప్రదించినట్లు విచారణలో షోహేలీ అంగీకరించింది.

అయితే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు గతంలో షోహేలి ఖండించింది. కానీ ఐసీయూ లోతుగా దర్యాప్తు చేపట్టడంతో నిజాన్ని ఒప్పుకుంది. ఐసీసీ విచారణలో ఫిక్సింగ్ కి ప్రయత్నించినట్లు తేలడంతో పలు నిబంధనల కింద ఆమెపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈనెల 10 నుండి షోహేలీపై నిషేధం అమల్లోకి వస్తుందని ఐసిసిఐ మంగళవారం ప్రకటించింది.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్క్ తో పాటు 6 గురు ఔట్.. ఆసీస్ కెప్టెన్ గా స్మిత్

ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడిన పదిమంది భరత ఆటగాళ్ల జాబితాను చూస్తే.. ఇందులో ముఖ్యంగా శ్రీశాంత్ పేరు వినబడుతుంది. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. 2012 ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ ఆటగాడు టి.పి సురేంద్ర, మొహ్నీష్ మిశ్రా, అమిత్ యాదవ్, అభినవ్ బాలి, శలబ్ శ్రీవాస్తవ, అంకిత్ చవాన్, అమిత్ సింగ్, అజిత్ చండీలా, సిద్ధార్థ్ త్రివేది, హికెన్ షా వంటి ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారు.

Related News

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

Big Stories

×