E-Paper
Advertisement

Rishabh Pant : మరోసారి నీరజ్ చోప్రా లాగా మారిన రిషబ్ పంత్… ఈ సారి 70 మీటర్ల ఎత్తుకు బ్యాట్.. కొంచెం అయితే సిక్స్ వెళ్లేదే!

Rishabh Pant : మరోసారి నీరజ్ చోప్రా లాగా మారిన రిషబ్ పంత్… ఈ సారి 70 మీటర్ల ఎత్తుకు బ్యాట్.. కొంచెం అయితే సిక్స్ వెళ్లేదే!

Rishabh Pant : టీమిండియా వైస్ కెప్టెన్  రిషబ్  పంత్ టెస్ట క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ క్రికెట్ లో తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ఒక సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో మరో సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఇక రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ 25 పరుగులు చేశాడు. తాజాగా రెండో ఇన్నింగ్స్ లో నీరజ్ చోప్రా మాదిరిగా మారాడు రిషబ్ పంత్. తన చేతిలో ఉన్నటువంటి బ్యాట్ జారిపోయింది.  దీంతో ఏకంగా ఈ సారి మాత్రం 70 మీటర్ల ఎత్తుకు బ్యాట్ వెళ్లడం విశేషం.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Hasin Jahan on Shami : భార్యను చంపేందుకు టీమిండియా బౌలర్ కుట్రలు.. డబ్బులు ఇచ్చి మరి దారుణం..!

రిషబ్ పంత్ ఆట.. ఆశ్యర్యపోవాల్సిందే..!

టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ 269 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో కూడా 161 పరుగులు చేశాడు. గిల్ రెండు టెస్టుల్లో కూడా సెంచరీ చేశాడు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ చేశాడు. త్రిబుల్ సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో వెనుదిరగడం విశేషం. ఇక భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్ లో 25 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో రిషర్ పంత్ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ లో ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ గా రిసబ్ పంత్ నిలిచాడు. తాజాగా మరోవైపు టెస్ట్ క్రికెట్ లో ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన ఆసియా కెప్టెన్ గా కూడా గిల్ రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగి తొలి టెస్టులో పంత్ 134 పరుగులతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్ లో 129 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 

148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో.. 

దీంతో వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు పంత్.  వాస్తవానికి 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇద్దరూ వికెట్ కీపర్లు మాత్రమే ఒక మ్యాచ్ లో రెండు సెంచరీలను నమోదు చేశారు. 26 ఏళ్ల క్రితం జింబాబ్వే క్రికెటర్ ఆండ్రీ ఫ్లవర్ ఈ ఫీట్ సాధించాడు. 2000లో భారత్ తో నాగ్ పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆండీ ఫ్లవర్ తొలి ఇన్నింగ్స్ లో 232 పరుగులతో అజేయంగా నిలిచిన అతను రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక ఆ తరువాత ఇన్నేళ్లకు రిషబ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు. రిషబ్ పంత్ కి ఇది 8వ టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు పంత్.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×